విచారణ తర్వాతే అరెస్ట్: వరకట్న వేధింపుల కేసుల్లో సుప్రీం సంచలన తీర్పు
వరకట్న వేధింపులకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేయటం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టులకు ముందు ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణను జరపాలని.
న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
వరకట్న వేధింపులకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేయటం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టులకు ముందు ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణను జరపాలని, ఆ తర్వాతే చర్యకు ఉపక్రమించాలని స్పష్టం చేసింది.
భర్త, అతని తరఫు బంధువుల వేధింపుల నుంచి భార్యకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన చట్టం దుర్వినియోగం అవుతున్నందున ప్రతి జిల్లాలోనూ కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

వేధింపులపై ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ కమిటీలు పరిశీలించి నివేదిక సమర్పించిన తర్వాతే చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. ఆ కమిటీల విధివిధానాలనూ న్యాయస్థానం నిర్దేశించింది.
రాజేశ్ శర్మ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఏకే గోయెల్, యుయు లలిత్లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పునిచ్చింది. వరకట్న హింస నిరోధక చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఆ చట్టానికి తగిన సవరణలు చేయాలని కేంద్ర న్యాయశాఖను కోరింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications