Gold: సినీ ఫక్కీలో ఛేజ్.. 3 గంటల తర్వాత చిక్కిన స్మగ్లర్లు..
పాన్-ఇండియా ఆపరేషన్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బంగారం స్మగ్లర్లను పట్టుకుంది. సినిమా ఫక్కీలో స్మగ్లర్లను అధికారులు పట్టుకున్నారు. అడవుల్లో వంకల తిరిగిన రోడ్ల మధ్య వెంబడిస్తూ నాటకీయంగా మూడు గంటల పాటు ఛేజింగ్ చేసి మరి స్మగ్లర్లను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 19 విలువ చేసే 31.7 కిలోల బరువున్న భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్టోబర్ 13-14 తేదీల్లో వారణాసి, నాగ్పూర్, ముంబయిలో చాలా ఖచ్చితమైన ప్రణాళికతో పరేషన్ నిర్వహించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోల్కతా నుంచి బయలుదేరిన రైలులో నాగ్పూర్ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు నాగ్పూర్ బృందం రెండు బంగారు క్యారియర్లను పట్టుకుంది. వారి నుంచి 8.5 కిలోల విదేశీ మార్క్ బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారి విచారించగా.. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి బంగారం స్మగ్లింగ్ అవుతుందని చెప్పారు.

దీంతో అధికారులు స్మగ్లర్లు కారులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. 3 గంటల పాటు స్మగ్లర్ల కారును వెంబడించి చివరికి పట్టుకున్నరారు. కారు హ్యాండ్ బ్రేక్ కింద ఉన్న రంధ్రంలో బంగారాన్ని 18 కిలోలు బంగారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా భారతదేశంలోకి తీసుకువచ్చిన బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారు. యూపీ పోలీసుల సాయంతో డీఆర్ఐ బృదం అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
ఇంకోచోట రైలులో వారణాసినుంచి ముంబై చేరుకున్న ఐదుగురు నిందితులను ముంబై డీఆర్ ఐ బృందం పట్టుకుంది. వారి నుంచి 4.9 మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. వారిలో ఐదుగురిని ముంబైలో, ఇద్దరిని వారణాసిలో నాలుగురిని నాగ్పూర్లో అరెస్టు చేశారు. ఈ 11 మంది నిందితులు బంగారు స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications