బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో డ్రగ్స్ మాఫియా..ఒక మహిళతో సహా ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్ .. భారీగా డ్రగ్స్ సీజ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరులో మాదకద్రవ్యాల పెడలర్స్ ఆరోపణలపై ఒక మహిళ తో సహా ఇద్దరు నైజీరియన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి నెదర్లాండ్స్ మరియు ఇథియోపియా నుండి పోస్టల్ పార్సెల్ సర్వీస్ ద్వారా వచ్చిన మూడు వేల ఎక్స్టసీ మాత్రలు మరియు కొకైన్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఏజెన్సీ మంగళవారం తెలిపింది.

కేరళలో రేవ్ పార్టీ..మత్తులో సినీ , టీవీ సీరియల్ నటులు..భారీగా డ్రగ్స్ సీజ్, 9 మంది అరెస్ట్కేరళలో రేవ్ పార్టీ..మత్తులో సినీ , టీవీ సీరియల్ నటులు..భారీగా డ్రగ్స్ సీజ్, 9 మంది అరెస్ట్

 డ్రగ్ పెడలర్లుగా పని చేస్తున్న ఒక మహిళతో సహా ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్

డ్రగ్ పెడలర్లుగా పని చేస్తున్న ఒక మహిళతో సహా ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్

ఇంటెలిజెన్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం డ్రగ్స్ సరఫరాదారుల కదలికలపై నిఘా పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిసెంబర్ 18 న బెంగళూరులోని విదేశీ పోస్టాఫీసు వద్ద డ్రగ్స్ ప్యాకెట్లను సేకరించడానికి వచ్చినప్పుడు ఎన్‌సిబి అధికారుల బృందం పక్కా స్కెచ్ వేసి మరీ పట్టుకుంది. డ్రగ్స్ పెడలర్లు గా పనిచేస్తున్న రామ్లా షెడాఫా నాన్సీ, ఇమ్మాన్యుయేల్ మైఖేల్‌లను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ పేర్కొంది. మొత్తం 3,000 పసుపు మరియు బూడిద రంగు ఉన్న ఎక్స్టసీ మాత్రలు, ఎమ్‌డిఎంఎ, 610 గ్రాముల బరువు ఉన్న ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు .

 భారీగా ఎక్స్టసీ మాత్రలు,కొకైన్ స్వాధీనం

భారీగా ఎక్స్టసీ మాత్రలు,కొకైన్ స్వాధీనం

అంతేకాకుండా 235 గ్రాముల కొకైన్‌ను మరో పార్శిల్ నుంచి ఎన్‌సిబి బృందం స్వాధీనం చేసుకుంది.ప్రాధమిక దర్యాప్తులో ఎమ్‌డిఎంఎ మాత్రలు, పంపిణీ కోసం నెదర్లాండ్స్ నుంచి సేకరించినట్లు తేలింది. కొకైన్‌ను ఇథియోపియా నుండి తెప్పించినట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో అనేక మాదకద్రవ్యాల రాకెట్ల గుట్టు రట్టు చేస్తోంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో . ఇక తాజాగా బెంగళూరులో అరెస్టు చేసిన నైజీరియన్ల పాస్‌పోర్ట్‌లు నకిలీవని అధికారులు అనుమానిస్తున్నారు.

గత ఐదేళ్ళుగా పెరిగిపోయిన డ్రగ్స్ కల్చర్ .. మెట్రో నగరాలపై నజర్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

గత ఐదేళ్ళుగా పెరిగిపోయిన డ్రగ్స్ కల్చర్ .. మెట్రో నగరాలపై నజర్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

దేశంలో గత ఐదేళ్లుగా ఇటువంటి మాదకద్రవ్యాల వినియోగం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చాలా రెట్లు పెరిగిందని ఎన్‌సిబి పేర్కొంది. ముంబై, హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై , వంటి మెట్రో నగరాలలో డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది . సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఆ తర్వాత తీగ లాగితే డొంకంతా కదిలినట్లు డ్రగ్స్ మాఫియా గుట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రట్టు చేస్తూనే ఉన్నారు.

అరుదైన దివ్యభారతీ ఫోటోలు.. ఈ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూశారా?

English summary
Two Nigerian nationals, including a woman, have been arrested here on charges of drug peddling and 3,000 ecstasy pills and cocaine, received from the Netherlands and Ethiopia through postal parcel service, seized by the Narcotic Control Bureau, the central agency said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X