Sister: ప్రాణం మీదకు తెచ్చిన పానీపూరీ, అక్కాచెల్లెళ్లు మీద తాగేసి కారు నడిపిన యువకులు !
నోయిడా: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోంగా కాపురం చేస్తోంది. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. షాపింగ్ చెయ్యడానికి మహిళ బయలుదేరింది. మహిళతో పాటు ఆమె ముగ్గురు కూతుర్లు వెళ్లారు. కుమార్తెలు పానీపూరీ తినాలని తల్లికి చెప్పారు. ముగ్గురు కుమార్తెలు పానీపూరీ తింటున్న సమయంలో వేగంగా వెళ్లికారు ముగ్గురు అమ్మాయిల మీద దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలకు తీవ్రగాయాలు కావడంతో ఓ అమ్మాయి ప్రాణం పోయింది. పీకలదాక తాగేసిన యువకులు మద్యం మత్తులో కారు నపడంతో ఇంత జరిగింది.
Romance: భర్తతో కాపురం, రాత్రికి ఎంజాయ్ చేద్దాం రాఅని ప్రియుడు ఫోన్, నువ్వెంత నీ బతుకెంత ?, నన్నే !
షాపింగ్ కు బయలుదేరిన తల్లి
నోయిడాలోని ఖజూర్ కాలనీలో పుష్పా అనే మహిళ నివాసం ఉంటున్నారు. పుష్పాకు అంకితా (18), అను (15), రియా (6) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పుష్పా సోమ్ బజార్ లో షాపింగ్ చెయ్యడానికి బయలుదేరింది. మేముకూడా నీ వెంట వస్తామని, ఇంట్లో బోరు కొడుతోందని ముగ్గురు కుమార్తెలు తల్లి పుష్పాకు చెప్పారు.
వాడి కోసం
ముగ్గురు కుమార్తెలతో కలిసి పుష్పా సోమ్ బజార్ కు బయలుదేరింది. పుష్పా షాపింగ్ చేసింది. తరువాత పానీపూరీ తినాలని ఉందని ముగ్గురు కుమార్తెలు ఆమె తల్లి పుష్పాకు చెప్పారు. బయటకు వచ్చిన కుమార్తెలకు పానీపూరీ తీసివ్వాలని పుష్పా వెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న పానీపూరీ బండి దగ్గర పుష్పా ముగ్గురు కుమార్తెలు పానీపూరీ తింటున్నారు.
అమ్మాయి ప్రాణం పోయింది
ఆ సందర్బంలో అటువైపు వేగంగా వెళ్లిన కారు పానీపూరీ తింటున్న ముగ్గురు అమ్మాయిల మీద దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన అను, అంకితా, రియాను నోయిడాలోని పీజీఐసీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం ఆరు సంవత్సరాల రియా చనిపోయింది. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు కారులో వేగంగా వచ్చి పానీపూరీ తింటున్న వారి మీద కారునడిపారని పోలీసులు చెప్పారు. పానీపూరీ తినడానికి వెళ్లిన అమ్మాయిల మీద మద్యం మత్తులో కారు నడపడం నోయిడాలో కలకలం రేపింది.