శుభవార్త: కిరాణ మార్కెట్లోకి ముఖేష్ అంబానీ, జియో కష్టమర్లకు డిస్కౌంట్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోతో టెలికం రంగంలోనే విప్లవం సృష్టించారు ముఖేష్ అంబానీ.అయితే టెలికం రంగంతో పాటు కిరాణ మార్కెట్లో కూడ ప్రవేశించాలని ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తన్నారు.
రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశం సంచనాలతో ప్రారంభైంది. ఉచితంగానే వాయిస్ కాల్స్, డేటాలను అందిస్తూ ఉచిత సేవలను రిలయన్స్ జియో తన కష్టమర్లకు అందించింది.
జియో రంగ ప్రవేశంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్లను మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే కొత్త కొత్త పథకాలు , ప్లాన్స్తో రిలయన్స్ జియో మార్కెట్లోకి వస్తోంది. తాజాగా కిరాణా మార్కెట్లోకి ప్రవేశించాలని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

కిరాణా మార్కెట్లోకి దిలయన్స్
కిరాణా మార్కెట్లో ప్రవేశించేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు. భారత్ మార్కెట్పై బహుళ జాతి సంస్థలు కన్నేసి పనిచేస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో ముఖేష్ అంబానీ కూడ కిరాణా రంగంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో ఉండే కిరాణా దుకాణాలను కూడ లక్ష్యంగా చేసుకొని ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు.

జియో కష్టమర్లకు డిస్కౌంట్లు
రిలయన్స్ జియో తన కస్టమర్లకు కిరాణా దుకాణాల్లో తగ్గింపు ధరలకే కొనుగోలు చేసుకునేలా డిజిటల్ కూపన్లను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం జియో తన సొంత నిధులను ఖర్చు పెట్టదు. కేవలం తయారీదారులు, కిరాణా దుకాణాలకు, తన చందాదార్లను పరిచయం చేసి... తద్వారా తన చందాదారులకు ప్రయోజనం కల్పించడంపై దృష్టి సారిస్తుంది.

ఉత్పత్తుల ప్రమోషన్ కోసమిలా
వస్తువుల తయారీదారులకు వారి బ్రాండ్ల ప్రమోషన్ జరుగుతుంది. కిరాణా దుకాణాలకు మరింత మంది కస్టమర్లు చేరువవుతారు. ఈ తగ్గింపు ఆఫర్లతో జియో సైతం ప్రస్తుత తన కస్టమర్లను కాపాడుకోవడంతో పాటు కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతుంది. ఇప్పటికే ముంబై, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్టు మొదలైంది. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని ముకేశ్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు.

చిన్న కిరాణా దుకాణాలే లక్ష్యం
650 బిలియన్ డాలర్ల దేశ రిటైల్ పరిశ్రమలో ఈ కామర్స్ కంపెనీల వాటా కేవలం 3-4 శాతంగానే ఉంది. వ్యవస్థీకృత రిటైలర్ల(పెద్ద మాల్స్) వాటా 8% ఉండగా, 88% వాటా చిన్న కిరాణా దుకాణాల చేతుల్లోనే ఇప్పటికీ ఉండటం గమనార్హం. ఇంత భారీ మార్కెట్ అవకాశాలను అంబానీ ఏ రకంగా తనకు అనుకూలంగా మార్చుకొంటాడో చూడాల్సి ఉంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications