ఉత్తరాదిన భూప్రకంపనలు: జనం పరుగులు
న్యూఢిల్లీ: భూప్రకంపనలతో ఉత్తర భారతం వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ సహా నోయిడా, కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఛండీగఢ్లలో ఆదివారం సాయంత్రం 5నిమిషాలపాటు భూప్రకంపనలు సంభవించాయి.
ఈ ఘటనతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల కారణంగా ఢిల్లీలో మెట్రో రైల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్, భింద్, మోరేనా, భోపాల్ లాంటి నగరాల్లోనూ స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. కాగా, పలు చోట్ల ఇళ్లు స్పల్పంగా దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగినట్లు సమాచారం లేదు.

పాక్లో భారీ భూకంపం: హిందూకుష్ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రం
పాకిస్థాన్లోనూ భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.6గా నమోదైంది. పాక్లోని పంజాబ్, పెషావర్, ఇస్లామాబాద్ తదితర ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపించింది.
పాకిస్థాన్తో పాటు ఉత్తర భారతాన్ని వణికించిన భూకంప కేంద్రం ఆప్ఘనిస్థాన్లోని ఆష్కాషం ప్రాంతంలో గల హిందూకుష్ పర్వతశ్రేణుల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫైజాబాద్కు 88 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 210 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు తెలిపారు. భూకంప కారణంగా సంభవించిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications