పాల్ఘర్లో భూకంపం: భయంతో జనం బయటకు పరుగులు, లడఖ్లోనూ..
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్లో మంగళవారం రాత్రి 9.33 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్ సీఎస్) వెల్లడించింది.
అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగినట్లు సమాచారం లేదు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. అధికారులు పరిస్థితిపై సమీక్షిస్తున్నారు.

లడఖ్లోనూ భూకంపం
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని లేహ్లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.1గా నమోదైంది. మంగళవారం ఉదయం 5.13 గంటలకు భూకంపం సంభవించగా, దీని భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. కాగా, గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో తరచూ స్వల్ప భూకంపాలు సంభవిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications