సాక్షి మహారాజ్ కు ఈసీ షోకాజ్ నోటీసులు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కు ఎలక్షన్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీచేసింది.
న్యూఢిల్లీ: అనుకున్నంతా అయింది. ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కు ఎలక్షన్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జనవరి 4న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత సాక్షి మహారాజ్ నోరుజారిన విషయం తెలిసిందే.
గత శనివారం మీరట్ లోని ఓ దేవాలయ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక వర్గానికి చెందిన వారు నలుగురిని పెళ్లి చేసుకుని, నలభై మంది పిల్లల్ని కంటూపోవడమే భారతీయ జనాభా విపరీతంగా పెరగడానికి కారణమని సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలను జేడీ-యూ నేత కె.సి.త్యాగి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.సి.మిట్టల్ తప్పుబట్టడం, ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని, తాము దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొనడం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై రేపటిలోగా వివరణ ఇవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కు పంపిన షోకాజ్ నోటీసుల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications