60లక్షల నకిలీ ఓటర్లు: కాంగ్రెస్ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ఈసీ!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాపై విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
విచారణ కోసం రెండు టీమ్స్ ను నియమించిన ఈసీ.. జూన్ 7వ తేదీ లోగా నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది. దీంతో మధ్యప్రదేశ్ లోని నరేలా, భోజ్ పూర్, సియోని-మాల్వా, హోషంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ కార్డుల అవకతవకలపై ఈసీ నియమించిన టీమ్స్ విచారణ జరపనున్నాయి.

కాగా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై పలు ఆరోపణలు చేసింది. 2019ఎన్నికల కోసం బీజేపీ భారీ ఎత్తున నకిలీ ఓటర్ కార్డులను తయారుచేస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలో దాదాపు 60లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్టుగా ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఈసీకి సమర్పించింది.
'ఈసీకి మేము ఆధారాలు సమర్పించాం. రాష్ట్రంలో దాదాపు 60లక్షల నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే సాగింది.' అని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆరోపించారు. ఇదే విషయంపై మరో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య తీవ్రంగా మండిపడ్డారు.
'గత 10ఏళ్లలో రాష్ట్ర జనాభా 24శాతం పెరిగితే ఓటర్లు మాత్రం 40 శాతం పెరగడమేంటి?.. ఇదెలా సాధ్యం?.. చాలాచోట్ల మేము పరిశీలించాం. ఒక్క ఓటరు పేరు 26 ఓటర్ లిస్టుల్లో నమోదైంది.' అని ఆరోపించారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications