కర్ణాటకలో 15 స్థానాలకు ఉపఎన్నికల తేదీ ప్రకటించిన ఈసీ
బెంగళూరు: కర్ణాటకలోని 15 శాసనసభ నియోజకవర్గాల ఉపఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. డిసెంబర్ 5న 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
నవంబర్ 11 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నవంబర్ 19న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 21 వరకు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చింది.

డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పీకర్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
ఈ క్రమంలో ఈ స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అక్టోబర్ 21 నుంచే ఉప ఎన్నికలు జరుగుతాయని భావించినప్పటికీ ఎన్నికల సంఘం ఈ డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
అథాని, గొకక్, యల్లపుపూర్, హోసకొటే, శివాజీనగర్, కృష్ణరాజ్ పేట్, హున్సూర్, కగ్వాల్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఇంతకుముందు ఎన్నికల సంఘం మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications