రాహుల్ ముందే ఓటమిని అంగీకరించారా? ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపణ
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలకు ముందే- అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఓటమిని అంగీకరించారా? ఎగ్జిట్ పోల్స్ వెలువడక ముందే.. ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన అంచనా వేయగలిగారా? మరోసారి ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని నిర్ణయానికి వచ్చేశారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే- ఎగ్జిట్ పోల్స్ వెలువడటానికి ముందు రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్ ఆయా అనుమానాలను రేకెత్తిస్తోంది.
From Electoral Bonds & EVMs to manipulating the election schedule, NaMo TV, “Modi’s Army” & now the drama in Kedarnath; the Election Commission’s capitulation before Mr Modi & his gang is obvious to all Indians.
— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2019
The EC used to be feared & respected. Not anymore.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఎలక్టోరల్ బాండ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభావితం చేశారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. దీనితోపాటు- నమో టీవీ, మోడీ ఆర్మీ వంటి సౌకర్యాలను బీజేపీ, నరేంద్ర మోడీ సంపూర్ణంగా వినియోగించుకున్నారని, వాటి ద్వారా ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయగలిగారని రాహుల్ గాంధీ విమర్శించారు. తాజాగా- కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సందర్భంగా సరికొత్త డ్రామాకు తెర తీశారని ఆయన మండిపడ్డారు.