DKS: పాదయాత్ర చేసింది చాలు, వెంటనే ఢిల్లీ వచ్చేయండి, డీకే బ్రదర్స్ కు ఈడీ షాక్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్ డీకే శివకుమార్ కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు కచ్చితంగా మీరు ఢిల్లీలోని కార్యాయానికి వచ్చి విచారణ ఎదుర్కొవాలని సూచించారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ జోడో యాత్రం జరుగుతున్న సమయంలో, సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని రాజకీయ కక్ష సాధింపులు సాగిస్తున్నారని, విచారణకు హాజరుకావడానికి సమయం ఇవ్వాలని మనవి చేసినా ఈడీ అధికారులు పట్టించుకోవడం లేదని డీకే శివకుమార్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ పాదయాత్రం
రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి టూ కాశ్మీర్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సస్ చెయ్యాలని కేపీసీసీ అధ్యక్షుడు మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్ కంకణం కట్టుకున్నారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చెయ్యాలని డీకే. శివకుమార్, డీకే. సురేష్ సోదరులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు.

రాహుల్ గాంధీకి సోనియా మద్దతు
కర్ణాటకలో జోడో యాత్రం జరుగుతున్న సమయంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. కొన్ని రోజుల నుంచి సోనియా గాంధీ రాహుల్ వెంట పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని వదలకుండా డీకే. శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య వారి వెంట పాదయాత్ర చేస్తున్నారు.

నడించింది చాలు.... మీరు రండి
పీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్ డీకే శివకుమార్ కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు కచ్చితంగా మీరు ఈనెల 7వ తేదీన శుక్రవారం ఢిల్లీలోని కార్యాయానికి వచ్చి విచారణ ఎదుర్కొవాలని సూచించారు.

టైమ్ అడిగినా ఇవ్వలేదు
వాస్తవానికి డీకే. శివకుమార్ సోదరులకు ఈడీ అధికారులు గత నెల 23వ తేదీన నోటీసులు జారీ చేసి అక్టోబర్ 7వ తేదీన విచారణకు హాజరుకావాలని సూచించారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నానని, విచారకు హాజరుకావడానికి మాకు సమయం కావాలి డీకే. శివకుమార్, ఆయన సోదరుడు డీకే. సురేష్ ఈడీ అధికారులకు లేఖరాశారు.

సమయం లేదు మిత్రమా..... వచ్చేయండి
డీకే. శివకుమార్ టైమ్ కావాలని అడిగినా ఈడీ అధికారులు మాత్రం మరోసారి నోటీసులు జారీ చేసి కచ్చితంగా శుక్రవారం ఢిల్లీలోకి రావాలని సూచించారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ జోడో యాత్రం జరుగుతున్న సమయంలో, సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని డీకే శివకుమార్ ఆరోపించారు.

రాజకీయ ‘కక్ష' సాధింపు
ఢిల్లీ కార్యాలయంలో మమ్మల్ని విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చి రాజకీయ కక్ష సాధింపులు సాగిస్తున్నారని, విచారణకు హాజరుకావడానికి సమయం ఇవ్వాలని మనవి చేసినా ఈడీ అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం మైసూరులోని విమానాశ్రయం దగ్గర మాజీ మంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications