కేజ్రీవాల్ ఇంట్లో 150పేజీల కీలక డాక్యుమెంట్లు: ఈడీ అధికారులు షాక్; ట్విస్ట్ ఏంటంటే!!
సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆపై మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.
ఆయనను ఈ కేసులో మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వాలని ఈడి అధికారులు కోరగా, కోర్టు ఆరు రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. దీంతో నేటి నుంచి కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. నిన్న రాత్రంతా కేజ్రీవాల్ ఈడీ ఆఫీసులో లాకప్ లోనే గడిపారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రివాల్ ను అరెస్ట్ చేయడానికి ముందు దాదాపు రెండున్నర గంటల పాటు, ఆయన ఇంట్లో ఈడి అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీలలో వారు కీలక డాక్యుమెంట్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో ఈడీకి సంబంధించిన కీలక సమాచారం ఉందని తెలుస్తోంది.
దాదాపు 150పేజీలున్న ఆ డాక్యుమెంట్లలో ఈడి అధికారులకు సంబంధించిన కీలక సమాచారం ఉంది. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు చెందిన ఇద్దరు అధికారుల గురించి సమగ్ర సమాచారం అందులో ఉందని సమాచారం.ఈడీ స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులకు సంబంధించిన విషయాలు కావటంతో భద్రతాకారణాలతో గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ డాక్యుమెంట్ లలో సమాచారం ఉన్న ఒక అధికారి ఈ దాడులలో పాల్గొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమాచారం ఎందుకు సేకరించారు అన్నది తెలియాల్సి ఉంది. స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారుల సమగ్ర సమాచారం కేజ్రీవాల్ వద్ద ఉండడంతో అది చూసిన ఈడి అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీనిపై తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారుల దృష్టికి ఈ డాక్యుమెంట్లను తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications