ఫెమా ఉల్లంఘనలు: నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సోదాలు చేపట్టింది. విదేశీ మారక చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన కేసులో ఈడీ ఈ మేరకు సోదాలు నిర్వహించింది.
విదేశీ మారక చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల ప్రకారమే తాము ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సంపాదించేందుకే ఈ దాడులు చేసినట్లు చెప్పారు.

ముంబై, ఢిల్లీలోని నరేశ్ గోయల్ నివాసాలపై దాడులు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్ ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి తన కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాల్లో అవకతవకలు, భారీగా నిధుల మళ్లింపు చోటు చేసుకున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనిఖీ నివేదికలోనూ వెల్లడైంది. జెట్ ఎయిర్వేస్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ లైన్స్ ఛైర్మన్ గా ఉన్న నరేశ్ గోయల్ ఈ ఏడాది మార్చిలో సంస్థ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ దివాళా ప్రక్రియలో ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications