ఎయిర్ ఇండియా స్కామ్.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు
ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం చిక్కుల్లో పడ్డారు. యూపీఏ హయాం నాటి కేసు ఆయన్ని వెంటాడుతోంది. అప్పటి ప్రభుత్వంలో ఎయిర్ ఇండియాకు నష్టం కలిగించారనే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆయన సమన్లు అందుకున్నారు. ఎయిర్ ఇండియా విషయంలో భారీ కుంభకోణంతో పాటు నగదు అక్రమ చలామణీలో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ కేసులో దర్యాప్తు కొరకు ఈ నెల 23వ తేదీన ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాలనేది సమన్ల సారాంశం.
ఎయిర్ ఇండియా స్కామ్కు సంబంధించి అప్పట్లో విమానయాన శాఖ మంత్రిగా ప్రఫుల్ పటేల్ కొనసాగారు. పి.చిదంబరం ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఇదివరకే ఈ కేసుకు సంబంధించి ప్రఫుల్ పటేల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి విచారణ ఎదుర్కొన్నారు. అదే క్రమంలో చిదంబరానికి కూడా సమన్లు జారీ చేశారు అధికారులు. అదలావుంటే ఎయిర్సెల్ మ్యాక్సిస్తో పాటు ఐఎన్ఎక్స్ మీడియా తదితర కేసుల్లోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం.

మైనార్టీలకు ఇక పెద్ద దిక్కు బండి సంజయేనా.. ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీకి చెక్..?
ఎయిర్ ఇండియా కోసం 111 ఎయిర్ క్రాఫ్ట్స్ను కొనుగోలు చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. అయితే ఆ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. వేలాది కోట్ల రూపాయల ఏవియేషన్ స్కామ్ కారణంగా ఎయిర్ ఇండియా నష్టాల్లోకి జారుకుంది. 2008 - 2009 మధ్య కాలంలో కొన్ని విదేశీ ప్రైవేట్ విమాన సంస్థలకు ఎయిర్ స్లాట్స్ కేటాయించడంలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దాంతో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లినట్లు తేలింది. ఆ మేరకు అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications