సీన్ రివర్స్, పన్నీర్ సెల్వం, శశికళ గ్రూప్ ఎన్నికల గుర్తులు ఇవే !
పన్నీర్ సెల్వం వర్గానికి ఎన్నికల కమిషన్ ల్యాంప్ గుర్తు కేటాయించింది. అదే విధంగా అమ్మ ఏఐఏడీఎంకే పార్టీ పేరు పెట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం కోసం ఇన్ని రోజులు పోటీ పడిన పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలకు చేదు అనుభవం ఎదరైయ్యింది. రెండాకుల గుర్తు ఎవ్వరికీ ఇవ్వలేమని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది.
పన్నీర్ సెల్వం వర్గానికి ఎన్నికల కమిషన్ ల్యాంప్ గుర్తు కేటాయించింది. అదే విధంగా అమ్మ ఏఐఏడీఎంకే పార్టీ పేరు పెట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇక శశికళ వర్గానికి ఆటో రిక్షా గుర్తును కేటాయించామని ఎన్నికల కమిషన్ తెలిపింది.

తాము ఏఐఏడీఎంకే అమ్మ పార్టీ పేరుతో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని శశికళ వర్గం అంటోంది. ఇక జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరుతో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
మొత్తం మీద ఆర్ కే నగర్ -2017 ఉప ఎన్నికల్లో స్థానిక కార్యకర్తలు ఏ వర్గానికి మద్దతు ఇచ్చి గెలిపిస్తారో అంటూ టెన్షన్ మొదలైయ్యింది. అమ్మ అభిమానులు మూడు ముక్కలుగా చీలిపోతారా ? అనే విషయంపై అంతుపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications