Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video:ఈ భోజనం కుక్కలు కూడా తినవు.. కన్నీటి పర్యంతమైన కానిస్టేబుల్

ఉత్తరప్రదేశ్: పోలీస్ మెస్ లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, వారికి పెడుతున్న భోజనం కుక్కలు కూడా తినవంటూ ఓ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లోని పోలీస్ లైన్స్‌లోని మెస్‌లో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ బహిరంగంగా ఆరోపణలు గుప్పిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీస్ సిబ్బందికి ఇస్తున్న ఆహారం కుక్కలు కూడా తినవు .. కానిస్టేబుల్ ఆవేదన

పోలీసు సిబ్బందికి ఇస్తున్న ఆహారం కుక్కలు కూడా తినవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు సిబ్బందికి మెస్‌లో నీళ్ల పప్పు, ఉడకని రోటీలు వడ్డిస్తున్నారని కానిస్టేబుల్ మనోజ్ కుమార్ కన్నీరు కార్చారు. సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీస్ కానిస్టేబుల్ తన ఆవేదనను తెలియజేశారు

సరైన భోజనం లేకుండా డ్యూటీ ఎలా చెయ్యాలని ప్రశ్న

సరైన భోజనం లేకుండా డ్యూటీ ఎలా చెయ్యాలని ప్రశ్న

చేతిలో రోటీలు, అన్నం మరియు పప్పు గిన్నెతో, కానిస్టేబుల్ మనోజ్ కుమార్ 12 గంటల పాటు డ్యూటీ చేసిన పోలీసులు ఈ ఆహారాన్ని తింటారు. దీన్ని కుక్క కూడా తినదు. మేము ఈ ఆహారాన్ని తినలేము. కనీసం కడుపు సరైన భోజనం కూడా లేకుండా తాము ఎలా విధులు నిర్వర్తించాలని ప్రశ్నించారు. పోలీసు సిబ్బందికి పౌష్టికాహారం ఉండేలా వారికి ఇచ్చే భత్యాన్ని పెంచుతామని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చినప్పటికీ, వారికి ఇప్పటికీ నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన అన్నారు.

 భోజనం గురించి అడిగితే వేధింపులు.. పోలీస్ ఉన్నతాధికారులపై కానిస్టేబుల్ ఆరోపణ

భోజనం గురించి అడిగితే వేధింపులు.. పోలీస్ ఉన్నతాధికారులపై కానిస్టేబుల్ ఆరోపణ

ఇదంతా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు డిసిపి చేసిన స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వారివల్లే పోలీసు సిబ్బందికి నాణ్యత లేని ఆహారం అందించబడుతుందని కానిస్టేబుల్ తీవ్ర ఆవేదనతో పేర్కొన్నారు. ఫిరోజాబాద్‌లో పోస్ట్ చేయబడిన అలీఘర్ నివాసి అయిన మనోజ్ కుమార్, తనకు మరియు ఇతర తక్కువ స్థాయి సిబ్బందికి అందించే ఆహారం నాణ్యత గురించి ఫిర్యాదు చేయడంతో, మెస్ మేనేజర్ తనను ఉద్యోగం నుండి తొలగిస్తానని బెదిరించాడని పేర్కొన్నాడు.

 వాళ్ళ పిల్లలు ఈ భోజనం చేస్తారా? సోషల్ మీడియాలో వీడియో వైరల్

వాళ్ళ పిల్లలు ఈ భోజనం చేస్తారా? సోషల్ మీడియాలో వీడియో వైరల్


పోలీస్ డిపార్ట్మెంట్ లో వినడానికి ఎవరూ లేరు. పోలీసు ఉన్నతాధికారులు తమ సమస్యలు వినడం లేదు అందుకే ఇక్కడ నిరసన తెలుపుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. మీరు ఈ ప్లేట్‌లోని రోటీలు తినండి అంటూ పేర్కొన్న కానిస్టేబుల్ పోలీస్ అధికారుల పిల్లలు అలాంటి ఆహారం తింటారా అంటూ ప్రశ్నించారు. చివరికి కానిస్టేబుల్ మనోజ్ కుమార్‌ను ఇతర పోలీసు సిబ్బంది అతనిని నిరసన స్థలం నుండి తీసుకెళ్లారు. మెస్‌లో నాసిరకం ఆహారం గురించి ఫిర్యాదు చేసిన అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఫిరోజాబాద్ పోలీసులు దీనిపై దృష్టి సారించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+