Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశ సార్వభౌమత్వం పరిరక్షించేందుకు రె‘ఢీ’: ఐఏఎఫ్ చీఫ్ రాకేశ్ కుమార్ సింగ్

దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు వాయుసేన ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అన్నారు. ఐఏఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం యూపీలో గల ఘజియాబాద్ హిందాన్ ఎయిర్ బేస్ వద్ద విన్యాసాలను ప్రదర్శించారు. రాఫెల్ సహా యుద్ధ విమానాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాకేశ్ కుమార్ కామెంట్స్ చేశారు.

Recommended Video

    IAF Day 2020 : యుద్ధం సహా.. అన్నింటికీ IAF సిద్ధం! - Rakesh Kumar Singh Bhadauria || Oneindia Telugu

    ఇటీవల చైనా సరిహద్దులో జరుగుతోన్న ఘర్షణల నేపథ్యంలో రాకేశ్ కుమార్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని.. పోరాటానికి సిద్దమని ప్రకటించారు. ప్రభుత్వం సమాచారం ఇస్తే చాలు.. సరిహద్దుల్లో మొహరిస్తామని సంకేతాలను ఇచ్చారు. ప్రదర్శనలో చిన్ కూక్ హెలికాప్టర్లు కూడా ప్రదర్శించారు.

    Ever Ready to Safeguard Nation’s Sovereignty: IAF Chief

    వాయుసేన ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచిపోతుందని రాకేశ్ తెలిపారు. వైమానిక దళ సిబ్బంది చిత్తుశుద్ది, సంకల్పంలో ఐఏఎఫ్ ముందుకు సాగిందని వెల్లడించారు. వాయుసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చీఫ్ ఆఫ్ డిపెన్స్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నారవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హాజరయ్యారు. అంతకుముందు రోజు మీడియాతో రాకేశ్ మాట్లాడారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. యుద్ధం సహా.. అన్నింటికీ ఐఏఎఫ్ సిద్ధంగా ఉంది అని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+