fact check: ముంబై, పుణెల్లో మిలిటరీ లాక్డౌన్ అమలు చేస్తారా?
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ మొదలైన నాటి నుంచి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యాయి. తాజాగా, మరో ఫేక్ న్యూస్ బయటికి వచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, పుణె నగరాల్లో మిలిటరీ ఆధ్వర్యంలో లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు ఓ వార్త బాగా ప్రచారం జరుగుతోంది.
వచ్చే శనివారం మరో పది రోజులపాటు ముంబై, పుణె నగరాల్లో మిలిటరీ ఆధ్వర్యంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. అందుకే మీకు అవసరమైనవన్నీ ఇప్పుడే తెచ్చిపెట్టుకోండి. నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇప్పుడే తీసుకోండి. ఆర్మీ చేతుల్లోకి నగరం వెళ్లనుంది. పాలు, మందులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమీక్ష జరుపుతోంది. ఏ సమయంలోనైనా నిర్ణయం వెలువడవచ్చు అని ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. ముంబై, పుణె నగరాల్లో మిలటరీ లాక్ డౌన్ నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వం చేయలేదు. అన్ని నిత్యావసర వస్తువువులు కూడా అందుబాటులోనే ఉంటాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ నిబంధనలే అమలవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications