Fake Alert : ఎస్బీఐలో ఆధార్ ఆధారిత లావాదేవీలను నిలిపివేయలేదు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) యూఐడీఏఐ ఆధార్ ఆధారిత చెల్లింపు పద్ధతిని (ఏఈపీఎస్) నిలిపివేసినట్టుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. దీని ప్రకారం ఏఈపీఎస్ పద్దతి ద్వారా ఇకపై ఎస్బీఐ నుంచి ఎవరూ డబ్బులను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉండదు. దీనికి సంబంధించిన సర్వర్ను ఎస్బీఐ తాత్కకంగా స్తంభింపజేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు ప్రచారంలో ఉంది.
ఏప్రిల్ 14 వరకు సర్వర్ డౌన్ ఉంటుందని.. అప్పటివరకు ఎవరైనా ఏఈపీఎస్ పద్దతిలో లావాదేవీలు నిర్వహిస్తే డబ్బులు అందులోనే నిలిచిపోయే అవకాశం ఉందని అందులో చెబుతున్నారు.అయితే ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. ఆర్బీఐ ఇప్పటివరకూ అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదు. కాబట్టి ఎవరూ దీన్ని నమ్మవద్దు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏఈపీఎస్ విధానంలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ విధానంలో అకౌంట్ నంబర్,ఆధార్ సంఖ్యతో అనుసంధానిస్తే చాలు.. ఆధార్ బయోమెట్రిక్స్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు. ఆధార్ కోసం మీరు ఇచ్చిన వేలి ముద్రలతో వీటిని పోల్చిచూస్తారు.
ప్రభుత్వ పథకాలకు చెందిన సబ్సిడీని పొందేందుకు ఏపీఈఎస్ విధానం ఉపయోగపడుతోంది. ప్రస్తుతం మన దేశంలో లక్షలాది మంది ప్రజలు దీనిపై ఆధారపడివున్నారు. కాబట్టి లాక్ డౌన్ పీరియడ్లో ఫేక్ న్యూస్లతో వారిలో అనవసర భయాందోళనలు రేకెత్తించవద్దు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications