Family: భార్య, పిల్లలను చంపేసి అక్కడే ఆత్మహత్య, రాత్రి ఇంటికి వెళ్లిన భర్త ?, మ్యాటర్ ఏమిటంటే !
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతున్న భర్త పార్ట్ టైమ్ గా పెయింట్ పని చేస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త లోపల లాక్ చేశాడు. మరుసటి రోజు మద్యాహ్నం అయినా దంపతులు బయటకు రాలేదు. దంపతులు, వారి పిల్లలు ఎందుకు బయటకు రాలేదని పక్కింటి వాళ్లు వెళ్లి చూడగా హాల్ లో భార్య, పిల్లలు శవమై కనిపించడం, ఫ్యాన్ కు ఇంటి యజమాని వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.
దంపతుల హ్యాపీలైఫ్
పుదుచ్చేరిలోని అరియాంగుప్పంలోని పోస్టాఫీసు రోడ్డులో త్యాగరాజన్ (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంత్సరాల క్రితం త్యాగరాజన్ పచ్చివాజి అలియాస్ సెల్వరాణి (33) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. త్యాగరాజన్, సెల్వరాజన్ దంపతులు లక్ష్మీ (6) అనే కుమార్తె, ఆకాస్ (4) అనే కుమారుడు ఉన్నాడు. ఆటో నడుపుతున్న త్యాగరాజన్ పార్ట్ టైమ్ గా పెయింట్ పని చేస్తున్నాడు.
రూ. 18 లక్షలు అప్పు చేసిన భర్త
త్యాగరాజన్ సుమారు రూ. 18 లక్షల వరకు అప్పులు చేశాడని తెలిసింది. చేసిన అప్పులు తీర్చలేక త్యాగరాజన్ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కొంతకాలంగా దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన త్యాగరాజన్ భర్త లోపల లాక్ చేశాడు. మరుసటి రోజు మద్యాహ్నం అయినా దంపతులు బయటకు రాలేదు.
భార్య, పిల్లలను చంపేసి ఆత్మహత్య
దంపతులు, వారి పిల్లలు ఎందుకు బయటకు రాలేదని పక్కింటి వాళ్లు వెళ్లి చూడగా హాల్ లో సెల్వరాణి, ఆమె పిల్లలు శవమై కనిపించడం, ఫ్యాన్ కు త్యాగరాజన్ ఉరి వేసుకుని శవమై కనిపించడం కలకలం రేపింది. అప్పుల బాధతోనే త్యాగరాజన్ అతని భార్య, పిల్లలను గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసు అధికారులు అంటున్నారు.