వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Family: రాత్రి భర్త చేసినపనికి ?, భార్య, ఐదు మంది కూతుర్లు రైలు కిందపడి, ఒక్కడే మిగిలాడు !

|
Google Oneindia TeluguNews

రాయ్ పూర్: నిత్యం భర్త ఇంట్లో గోడవ పడుతున్నాడని భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇప్పటికే ఐదు మంది కుమార్తెలు ఉండటం, భర్త సక్రమంగా సంసారాన్ని పట్టించుకోకపోవడంతో భార్య నరకం అనుభవించింది. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్య, పిల్లలతో గొడవ పెట్టుకున్నాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన భార్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. తాను ఆత్మహత్య చేసుకుంటే తన కుమార్తెలు అనాథలు అవుతారని ఆమె ఆవేదన చెందింది. కుమార్తెలతో కలిసి తల్లి వేగంగా వెలుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునింది.

Daughter: కూతురికి ఇంటర్వ్యూ, హోటల్ లో రేప్ చేసిన తండ్రి, వీడియో తీసి బ్లాక్ మెయిల్, తల్లికి తెలిసి !Daughter: కూతురికి ఇంటర్వ్యూ, హోటల్ లో రేప్ చేసిన తండ్రి, వీడియో తీసి బ్లాక్ మెయిల్, తల్లికి తెలిసి !

 సాహూకు ఐదు మంది కూతుర్లు

సాహూకు ఐదు మంది కూతుర్లు

చత్తీస్ గఢ్ రాజధానికి 55 కిలోమీటర్ల సమీపంలోని మహాసముంద్ జిల్లాలోని బెలసోండ ప్రాంతంలో సాహూ, ఉమా సాహు (45) దంపతులు నివాసం ఉంటున్నారు. సాహు, ఉమా సాహు దంపతులకు అన్నపూర్ణ (18), యశోధ (16), భూమికా (14), కుంకుమ్ (12), తులసి (10) అనే ఐదు మంది కుమార్తెలు ఉన్నారు. సాహు, ఉమా దంపతులకు ఐదు మంది కుమార్తెలు కావడంతో కష్టం మీద వారిని పెంచిపోషిస్తున్నారు.

 ఇంట్లో రోజూ గోడవలే

ఇంట్లో రోజూ గోడవలే

నిత్యం భర్త సాహుతో ఇంట్లో గోడవ పడుతున్న భార్య ఉమా జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇప్పటికే ఐదు మంది కుమార్తెలు ఉండటం, భర్త సాహు సక్రమంగా పట్టించుకోకపోవడంతో ఉమా సాహు నరకం అనుభవించింది. భర్త చేష్టలతో విసిగిపోయిన ఉమా సాహూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. కుమార్తెలు అన్నపూర్ణ, యశోధ, భూమిక, కుంకుమ్, తులసిని పిలుచుకున్న ఉమా సాహు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

 భర్త చేసిన పనికి ఆరు మంది ప్రాణాలు ?

భర్త చేసిన పనికి ఆరు మంది ప్రాణాలు ?

మహాసముంద్- బెల్సోండా రైల్వే మార్గం మధ్యలోని రైల్వేక్రాసింగ్ సమీపంలో వేగంగా వెలుతున్న రైలు కింద పడి తల్లీ, ఐదు మంది కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబంలో ఆరు మంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో మృతదేహాలు చెల్లాచెదురు అయ్యాయని మహాసముంద్ జిల్లా ఎస్పీ మేఘ తంబుద్కర్ మీడియాకు చెప్పారు.

 ఫ్యామిలీలో ఒక్కడే మిగిలాడు

ఫ్యామిలీలో ఒక్కడే మిగిలాడు

భర్త సాహుతో అతని భార్య ఉమా సాహు గొడవపడిన తరువాత అందరూ కలిసి ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, కేసు విచారణలో ఉందని జిల్లా ఎస్పీ మేఘా తంబూద్కర్ అన్నారు. ఒకే కుటుంబంలో ఐదు మంది కూతుర్లు, తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు చలించిపోయారు. తన కోసం ఆరు మంది ప్రాణాలు పోయాయని సాహూ ఆవేదన చెందుతున్నాడని స్థానికులు అంటున్నారు.

English summary
Family: A woman and her five daughters allegedly committed suicide by jumping in front of a moving train apparently after a domestic dispute in Chhattisgarh’s Mahasamund district, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X