అబ్బ.. ప్లీజ్ నో.. రాష్ట్రపతి పదవీ పోటీకి ఫరూక్ నో.. కారణం ఇదే..?
రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థిపై క్లారిటీ రావడం లేదు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సమావేశం నిర్వహించిన క్యాండెట్ అంశం కొలిక్కి రాలేదు. నిన్నటి వరకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు వినిపంచింది. కానీ ఆయన తాను పోటీ చేయబోనని స్పష్టంచేశారు. ఓడిపోతామని తెలిసీ కూడా.. బరిలో నిలువడం ఎందుకు అని ఆయన అనుకున్నారు. తర్వాత తెరపైకి సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా పేరు వచ్చింది. కానీ ఆయన కూడా నో అంటున్నారు. మరీ విపక్షాల నుంచి ఎవరూ బరిలో నిలువనున్నారు.
కశ్మీర్ కోసమే..
రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగాలని విపక్షాలు ఆయనను అడిగాయి. అయితే తాను కశ్మీర్ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నానని కుండబద్దలు కొట్టారు. అంతే తప్ప రాష్ట్రపతి పదవీకి కాదని చెప్పారు. తాను బరిలో నిలువనని చెప్పానని పేర్కొన్నారు. ఇప్పుడు కశ్మీర్ సంక్లిష్టంగా ఉందని.. అందుకు తన సహాయ సహాకారాలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ఏదైనా చేయొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ద పదవీతో ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పకనే చెప్పారు.
ప్లీజ్ వద్దు
21న కౌంటింగ్
రాష్ట్రపతి
ఎన్నికలకు
నోటిఫికేషన్ను
ఈ
నెల
15న
జారీ
చేశారు.
ఆ
రోజు
నుంచే
నామినేషన్ల
స్వీకరణ
ప్రారంభం
అయ్యింది.
ఈ
నెల
29
వరకు
నామినేషన్లను
స్వీకరిస్తామని,
30న
నామినేషన్ల
పరిశీలన
ఉంటుందని
కేంద్ర
ఎన్నికల
సంఘం
ప్రధాన
కమిషనర్
రాజీవ్
కుమార్
తెలిపారు.
జులై
2
వరకు
నామినేషన్ల
ఉపసంహరణకు
గడువు
ఉంటుందని
తెలిపారు.
రాష్ట్రపతి
ఎన్నికల్లో
కీలకమైన
పోలింగ్ను
జులై
18న
నిర్వహిస్తామని..
జులై
21న
ఓట్ల
లెక్కిస్తామని
తెలిపారు.