ఓట్లు వెయ్యలేదని ఆర్మీ మేజర్ కుటుంబ సభ్యుల హత్య
హర్యానా: హర్యానాలో దారుణం జరిగింది. తమకు అనుకూలంగా ఓట్లు వెయ్యలేదని భారత్ ఆర్మీ మేజర్ కుటుంబ సభ్యులు ఇద్దరిని అతి దారుణంగా హత్య చేశాడు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఓ రౌడీ షీటర్ ఆర్మీ మేజర్ తండ్రి, ఆయన సోదరుడిని దారుణంగా కాల్చి చంపేశాడు.
సోనిపట్ జిల్లాలోని కరేవారి గ్రామంలో ఆర్మీ మేజర్ సుశీల్ చక్ర కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు, ఇదే గ్రామంలో రౌడీ షీటర్ అజయ్ చికరా సోదరుడు సంజయ్ చికరా సర్పంచ్ గా పోటీ చేశాడు. ఎన్నికల ప్రచార సమయంలో తన సోదరుడిరి ఓట్లు వెయ్యాలని లేదంటే చంపేస్తానని అజయ్ చికరా ఆర్మీ మేజర్ సుశీల్ చక్ర కుటుంబ సభ్యులను హెచ్చరించాడు.
ఎన్నికల్లో సంజయ్ చికరా ఓడిపోయాడు. ఈ విషయంపై కక్ష పెంచుకున్నఅజయ్ చికరా బైక్ లో వెలుతున్న సుశీల్ చక్ర తండ్రి జగ్ బీర్ సింగ్ (57), అతని సోదరుడు అనిల్ (25) ఇద్దరిని తుపాకితో కాల్చి చంపేశాడు. మా కుటుంబ సభ్యులను బెదిరించారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆర్మీ మేజర్ సుశీల్ చక్ర ఆరోపించారు.
ఈ విషయాన్ని తాను గతంలోనే సోనిపట్ డీఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విలపించారు. పోలీసులు ముందే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదని అన్నారు. తాము దేశం కోశం దేశ సరిహద్దుల్లో పని చేస్తుంటే మా కుటుంబ సభ్యులకు రక్షణ లేకుండా పోయిందని విలపించారు.
గతంలో తమ కుటుంబ సభ్యుల కంటే ముందే పలువురిని రౌడీషీటర్ బెదిరించాడని, అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుశీల్ చక్ర విచారం వక్తం చేశారు. ఇప్పటికే నిందితుడు గ్రామంలో నలుగురిని దారుణంగా హత్య చేశాడని ఆయన ఆరోపించారు.