తండ్రి, తనయుడు, తమ్ముడి కొడుకు ముగ్గురు గెలుస్తారు రాసుకోండి : కర్ణాటక మంత్రి రేవణ్ణ
నేను చెప్పింది మీరు రాసుకోండి , నేను చేప్పినవాళ్లు ఖచ్చితంగా గెలుస్తారు , ఇది నా జ్యోతిష్యం అని ఘంటాపథంగా చెప్పాడు కర్ణాటక మంత్రి రేవణ్ణ, తన తండ్రి, తమ్ముడు, తమ్ముడి కొడుకు ముగ్గురు పార్లమెంట్ కు వెళతారని చెప్పారు రేవణ్ణ.
కర్ణాటక ముఖ్యమంత్రి సోదరుడు, మంత్రి రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, తనయుడు, తమ్ముడి తనయుడి కూడ జేడిఎస్ సభ్యులు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పారు. మరోవైపు తాను జ్యోతిష్యం చెబుతున్నానని తన జ్యోతిష్యం ఎప్పుడు తప్పు కాదని తేల్చి అన్నారు. పైగా మీడియా ప్రతినిధులు కావాలంటే రాసుకోండి, తన అంచనాలు ఎప్పుడు తప్పు కావాని అన్నారు. మీడియా సైతం ఆయా నియోజవర్గాల్లో విపరీత ప్రచారం చేసిందని రేవణ్ణ అన్నారు. ఈ నేపథ్యంలోనే జేడీ [ఎస్] నుండి పోటి చేసిన దేవేగౌడ, నిఖిల్ , ప్రజ్వల్ లు పార్లమెంట్ లో తమ గొంతు వినిపిస్తారని అన్నారు.
కాగా రేవణ్ణ తండ్రి ,మాజి ప్రధాని దేవేగౌడ తూముకురు నియోజకవర్గం నుండి పోటి చేయగా , ఆయన తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ, హసన్ నుండి , ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ మాండ్య నుండి పోటి చేశారు. దీంతో రేవణ్ణ ఈ స్థానాలనుండి వీరి గెలుపు ఖాయమని చెప్పారు.కాగా రేవణ్ణ కర్ణాటకలోని ఐటి రైడ్స్ జరిగిన సంధర్బంలో కూడ సంచనల వ్యాఖ్యలు చేశారు.