అగ్నిగోళంగా ఉత్తర భారతం: ఈ నగరాల్లో హై టెంపరేచర్, కొన్నేళ్లలో లేనివిధంగా..
ఈ సారి అధిక మాసం వచ్చింది. దీంతో వేసవి నెల రోజులు ఆలస్యంగానే ప్రారంభమయ్యింది. అయితే ఉత్తర భారతం మాత్రం వేడికి అట్టుడుకుతోంది. వేడితో జనం ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 33.1 డిగ్రీ సెల్సియష్ ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి నెలలో ఈ స్థాయిలో టెంపరేచర్ నమోదవడం 11 ఏళ్లలో తొలిసారి అని భారత వాతావరణ శాఖ ప్రతినిధులు తెలిపారు.
ఏప్రిల్ 1, 2వ తేదీల్లో కాస్త వాతావరణ చల్లబడ్డ తర్వాత మాత్రం వేడి పెరుగుతోంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి టెంపరేచర్ మరింత పెరగనుంది అని తెలియజేశారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో అందుకు అనుగుణంగా శరీరాన్ని మార్చుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. తూర్పు, మధ్య, ఈశాన్య భారత దేశంలో వాతావరణం వేడెక్కుతోందని తెలియజేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా టెంపరేచర్ పెరుగుతుందని వివరించారు.

ఉత్తర భారత దేశం ముఖ్యంగా రాజస్తాన్లో వేడి ఎక్కువగా ఉండనుంది. సోమవారం 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చింది. ఇదీ 76 ఏళ్లలో అత్యధికం అని పేర్కొన్నారు. గుజరాత్, హర్యానాలో కూడా ఉష్ణోగ్రత నమోదవుతుందని వివరించారు. ఇటు కోల్ కతా, ముంబై, హైదరాబాద్లో కూడా టెంపరేచర్ పెరుగుతుందని తెలియజేశారు. అయితే పశ్చిమ బెంగాల్లో కొన్నిచోట్ల మాత్రం వేడి నుంచి ఉపశమనం కలుగనుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications