వ్యాపారిపై హత్యాయత్నం, ప్రముఖ నటిపై ఎఫ్ఐఆర్, డబ్బులు, గతంలో బ్లాక్ మెయిల్ !
మైసూరు/బెంగళూరు: అప్పుగా తీపుకున్న నగదు తిరిగి ఇవ్వమని చెప్పినందుకు రౌడీలు, యువకులతో తన మీద ప్రముఖ కన్నడ నటి ద్రిశ్య హత్యాయత్నం చేయించిందని వ్యాపార వేత్త కర్ణాటకలోని కేఆర్ఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడ నటి అనుచరులు హత్యాయత్నం చెయ్యడంతో భాదితుడు కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఆయోగ్య చిత్రంలో హీరోయిన్గా
ఇటీవల విడుదలైన కన్నడ ఆయోగ్య సినిమాలో ద్రిశ్య హీరోయిన్ గా నటించింది. తన దగ్గర ద్రిశ్య నగదు అప్పుగా తీసుకుందని వ్యాపార వేత్త రాజేష్ ఆరోపిస్తున్నాడు. తన దగ్గర తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని తాను నటి ద్రిశ్యకు చెప్పానని, ఆ సమయంలో ఆమె దురుసుగా ప్రవర్తించిందని వ్యాపార వేత్త రాజేష్ ఆరోపించారు.

అప్పు తీసుకొని రుణం..
అప్పుగా తీసుకున్న రుణం చెల్లించమని చెప్పడంతో నీ అంతు చూస్తానని, తన అనుచరులు, అభిమానులు నీ కు తగిన బుధ్ది చెబుతారని నటి ద్రిశ్య వార్నింగ్ ఇచ్చిందని రాజేష్ ఆరోపించాడు. శుక్రవారం రాత్రి తన మీద నటి ద్రిశ్య అనుచరులు, రౌడీలు కత్తులు, ఆయుధాలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని వ్యాపార వేత్త రాజేష్ కేఆర్ఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రౌడీలు దాడి చేయడంతో
అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాలని నటి ద్రిశ్యను అడుగుతావా, నీకు ఎంత ధైర్యం, నీ ప్రాణాలు తీస్తామని రౌడీలు దాడి చేసి బెదిరించారని రాజేష్ ఫిర్యాదు చేశాడని పోలీసులు అన్నారు. నటి ద్రిశ్య, ఆమె తండ్రి మీద కేసు నమోదు చేశామని కేఆర్ఎస్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేశామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఆస్పత్రిలో చికిత్స
దాడికి గురైన రాజేష్ కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. గతంలో నటి ద్రిశ్య మీద అనేక అరోపణలు ఉన్నాయి. నగదు కోసం తమను నటి ద్రిశ్య బ్లాక్ మెయిల్ చేసిందని కొందరు ఆరోపణలు చేసి పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు ఏకంగా నటి ద్రిశ్య మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications