ఒమర్పై గెలిచిన ఆనందం: ఏకే 47తో పీడీపీ నేత ఫైరింగ్, వీడియో
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని సోనావర్ నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పైన గెలిచిన ఆనందంలో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి మహమ్మద్ అష్రాఫ్ మిర్ తన నివాసం వద్ద ఏకే 47తో కాల్పులు జరిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు, అది వివాదాస్పదంగా మారింది. ఆయన గాలిలోకి కాల్పులు జరుపుతున్న వీడియో బయటకు వచ్చింది. ఒమర్ అబ్దుల్లా సోనావర్, బీరువా నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. సోనావర్లో ఓడిన ఒమర్, బీరువాలో మాత్రం గెలుపొందారు.

అయితే, సోనావర్లో ఒమర్ అబ్దుల్లా పైన గెలిచిన ఆనందంలో అష్రాఫ్ మిర్ తన ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో తన ఏకే 47తో పలురౌండ్లు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చాలామంది చూస్తున్నారు.
కాల్పులు జరపలేదు: మిర్
ఏకే 47తో కాల్పులు జరిపినట్లుగా వీడియో నెట్లో రావడంతో దాని పైన మహమ్మద్ అష్రాఫ్ మిర్ స్పందించారు. తాను ఎలాంటి కాల్పులు జరపలేదని చెప్పారు. తన భద్రత సిబ్బందికి చెందిన ఏకే 47 కిందపడితే తాను దానిని తీసి ఇచ్చానని వివరణ ఇచ్చారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications