నిన్న విలన్ ప్రభుత్వం, నేడు హీరో ప్రభుత్వం, టైం పాస్ సీఎం, పెత్తనం, బీజేపీ చీఫ్!
బెంగళూరు: కర్ణాటకలో ఇంతకు ముందు విలన్ ప్రభుత్వం ఉండేదని, కానీ ఇప్పుడు హీరో ప్రభుత్వం వచ్చిందని ఆరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ నళిన్ కుమార్ కటీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు టైం పాస్ సీఎం ఉన్నారని, పెత్తనం మాత్రం వేరేవాళ్లు చేశారని నళిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. హిందూ కార్యకర్తలు దారుణ హత్యకు గురైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమాజాన్ని ఒక్కటి చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ నళిల్ కుమార్ కటీల్ అన్నారు.

పార్ట్ టైం సీఎం
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హెచ్.డీ. కుమారస్వామి పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన ఒక పార్ట్ టైం సీఎం అని బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, డీకే. శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య సంకీర్ణ ప్రభుత్వంలో పెత్తనం చేశారని, కుమారస్వామి మాత్రం సైడ్ ఆక్టర్ గా మిగిలిపోయారని బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ వ్యాంగంగా అన్నారు.

ఈ రోజు హీరో ప్రభుత్వం
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో విలన్ ప్రభుత్వం ఉండేదని, బీఎస్. యడియూరప్ప సీఎం అయిన తరువాత హీరో ప్రభుత్వం వచ్చిందని నళిన్ కుమార్ కటీల్ అన్నారు. కుమారస్వామి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వరదలు వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, యడియూరప్ప ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరదలు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, ప్రజలు కష్టాలు తీర్చారని, ఇల్లు కొల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తామని యడియూరప్ప హామీ ఇచ్చారని, ఇదే విలన్ ప్రభుత్వానికి, హీరో ప్రభుత్వానికి తేడా అని బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ అన్నారు.

కల్యాణ కర్ణాటక లక్షం
కర్ణాటకలో బీజేపీని మరింత అభివృద్ది చేస్తామని నళిని కుమార్ కటీల్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 150 నియోజక వర్గాల్లో విజయం సాధిస్తుందని నళిన్ కుమార్ కటీల్ జోస్యం చెప్పారు. కర్ణాటకను కల్యాణ కర్ణాటక చెయ్యడం బీజేపీ లక్షం అని నళిన్ కుమార్ కటీల్ అన్నారు.

సిద్దూ దెబ్బకు డీకే అరెస్టు
డీకే. శివకుమార్ మీద ఈడీ అధికారులు కేసు నమోదు చెయ్యడం వెనుక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హస్తం ఉందని నళిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో డీకే. శివకుమార్ తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న విషయం సిద్దరామయ్య జీర్ణించుకోలేక ఆయన్ను కేసుల్లో ఇరికించారని నళిన్ కుమార్ కటీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్వేష రాజకీయాలు చేస్తున్నది బీజేపీ కాదని, సిద్దరామయ్య అని నళిన్ కుమార్ కటీల్ మండిపడ్డారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications