అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది
చైన్నై: సముద్రంలో చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని మనల్మేల్కుడి కృష్ణరాజపట్టినం చేపల రేవు నుంచి 200 మంది నాటు పడవల్లో చేపలు పట్టేందుకు మంగళవారం వెళ్లారు.

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది
రేవు నుంచి సుమారు 10 నాటికల్ మైళ్ల దూరం వెళ్లి చేపలు పడుతున్న సమయంలో తమ వలలో ఏదో బరువైన చేప చిక్కిందని తెలుసుకున్న మహమ్మద్, సుల్తాన్ అనే జాలర్లు దాన్ని అతి కష్టం మీద పైకి లాగారు.

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది
తమ వలలో పడిన ఎరుపు రంగు పల్సర్ బైక్ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ విషయం గురించి సముద్ర తీర భద్రతాదళానికి సమాచారం అందించారు.

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది
బైకుకు నెంబర్ ప్లేట్ లేదని గమనించిన పోలీసులు అక్రమ రవాణా కోసం దీనిని తీసుకువస్తూ, గస్తీ దళాలను చూసి ఎవరో సముద్రంలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బైక్ ఇంజన్, చాసిస్ నెంబర్ ఆధారంగా ఈ పల్సర్ బైక్ ఎవరిదన్న విషయాన్ని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications