నదిలో గల్లంతు: ఐదు మంది యువకుల జలసమాధి, స్నేహితులతో కలిసి వెళ్లారు, చివరికి !
స్నేహితులతో మాట్లాడి వస్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐదు మంది యువకులు నదిలో మునిగి జలసమాధి అయిన ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళ తాలుకాలో జరిగింది.
బెంగళూరు: స్నేహితులతో మాట్లాడి వస్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐదు మంది యువకులు నదిలో మునిగి జలసమాధి అయిన ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళ తాలుకాలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు.
మరో నలుగురి మృతదేహాల కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాళ తాలుకా మూలరపట్టె గ్రామంలో నివాసం ఉంటున్న అస్లామ్ (17), రమూజ్ (17), అజామత్ (18), ముబాశిర్ (17), సమాద్ (17) సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

రాత్రి పోద్దుపోయినా ఐదు మంది వారి ఇళ్లకు వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఐదు మంది కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. గ్రామం సమీపంలోని పాల్గణి నది సమీపంలో ఐదు మంది యువకుల దుస్తులు కనిపించాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నదిలో ఐదు మంది యువకుల ఆచూకి కోసం గాలించారు. మంగళవారం ఉదయం సమాద్ మృతదేహాన్ని గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన నలుగురు యువకుల మృతదేహాల కోసం పాల్గణి నదిలో గాలిస్తున్నారు. నదిలో ఈత కొట్టడానికి ప్రయత్నించి ఐదు మంది జలసమాధి అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications