బిజెపికి గుడ్బై:పార్టీలోనే.. ఖండించిన కలాం మనవడు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ఏపీజే డాక్టర్ అబ్దుల్ కలాం న్యూఢిల్లీలో నివసించిన బంగ్లాను స్మారక భవనంగా ప్రకటించాలని ఎన్ని సార్లు కేంద్రానికి మనవి చేసినా పట్టించుకోకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదనకు గురైనారు.
కలాం సోదరుడి మనువడు ఏపీజే హజ సయిద్ ఇబ్రహీం సోమవారం బీజేపీకి రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేశారు. భారతదేశానికి ఎనలేని సేవలు అంధించిన అబ్దుల్ కలాం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరించడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం రాష్ట్రపతి భవన్ లో ఉన్నారు. పదవీ విరమణ అనంతరం అబ్దుల్ కలాం ఢిల్లీలోని రాజాజీ మార్గ్ లోని నెంబర్ 10 బంగ్లాలో ఉన్నారు. కలాం మరణించే వరకు ఆయనతో పాటు ఏపీజే హజ సయిద్ ఇబ్రహీం అదే బంగ్లాలో ఉన్నారు.

కలాం మరణించిన తరువాత గత సెప్టెంబర్ నెలలో హజ సయిద్ ఇబ్రహీం బీజేపీలో చేరారు. అయితే కలాం నివాసం ఉంటున్న ఆ బంగ్లాను స్మారక చిహ్నంగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు.
అయితే కేంద్ర మంత్రి మహేష్ శర్మకు ఆ బంగ్లాను అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా హజ సయిద్ ఇబ్రహీం బీజేపీకి టాటా చెప్పారు. రామేశ్వరంలో హజ సయిద్ ఇబ్రహీం సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు.
ఖండించిన కలాం మనవడు
తాను బిజెపిని వీడానన్న వార్తల పైన మనవడు షేక్ సలీం స్పందించారు. తాను బిజెపిని వీడలేదని చెప్పారు. తాను బిజెపికి నమ్మకమైన కార్యకర్తనని వివరణ ఇచ్చారు. ఆయన వన్ ఇండియాతో మాట్లాడుతూ... మీడియాలో వచ్చిన వార్తలపై నేను ఆశ్చర్యానికి లోనయ్యానని చెప్పారు. ఎవరో రాసిన వాటి గురించి నేను మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications