బాలికపై మిత్రులతో కలిసి బాయ్ఫ్రెండ్ గ్యాంగ్ రేప్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరో దారుణ సంఘటన జరిగింది. ఓ బాలికపై నలుగురు పాఠశాల విద్యార్థులు సామూహిక అత్యాచారం జరిపారు. దానికి సంబంధించిన వీడియోను పంపించడంతో ఈ విషయం బాధిత బాలిక కుటుంబ సభ్యులకు తెలిసింది. 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యం నవంబర్ 8వ తేదీన ముంబైలోని మలాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
చదువులో సాయం చేయాలని కోరడానికి వచ్చి ఆమెపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నామని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాని మలాడ్ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ శశాంకో శంభోర్ చెప్పారు.
నిందితులు స్థానిక మైనర్ బాలురు. 9, 10 తరగుతులు చదువుతున్నారు. చిల్లర వేషాలకు ఆ ప్రాంతంలో వారు పెట్టింది పేరు. వారిని డోంగ్రీ కరెక్షన్ హోమ్కు పంపించినట్లు, వారిి శిశు సంక్షేమాధికారి ప్రశ్నిస్తారని ఆయన చెప్పారు.
ఓ రోజు అనుకోకుండా బాధిత బాలిక ఆంటీ మొబైల్కు వాట్సప్ వీడియో వచ్చింది. దాంట్లో ఈ అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలున్నాయి. ఈ దృశ్యాలు ఆ ప్రాంతంలో విరివిగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ వీడియో దృశ్యాలను చూసిన బాధిత బాలిక ఆంటీ పోలీసులకు బుధవారంనాడు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బాధిత బాలిక పదో తరగతి చదువుతోంది. నిందితులు బాలిక చదువుతున్న పాఠశాలలోనే చదువుతున్నారు. తమ ఇంటికి రావాల్సిందిగా బాలికను బాయ్ ఫ్రెండ్ పిలిచాడు. ఆ సమయంలో అతను తప్ప మరెవరూ లేరు. బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడ మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఆ పిల్లలు బాలికపై అత్యాచారం చేసి వీడియో తీశారు.
వాట్సప్ దృశ్యాలను బాలిక చూసినప్పటికీ సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేదు. బాలికకు తల్లిదండ్రులు లేరు. తన ఆంటీ వద్దనే ఉంటోంది.