Gangatic dolphin : యూపీ జలజంతువుగా గంగానది డాల్ఫిన్లు-యోగీ ఆదిత్యనాథ్ ప్రకటన..
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర జలచరంగా గంగానది డాల్ఫిన్లను ఎంపిక చేస్తూ యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓ ప్రకటన చేశారు. చెరువులు, నదుల స్వచ్ఛతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని యోగీ గుర్తుచేశారు. ఈ డాల్ఫిన్లు గంగా, యమునా, చంబల్, ఘఘ్రా, రాప్తి , గెరువా నదులలో కనిపిస్తాయన్నారు.ఉత్తరప్రదేశ్లో గంగా డాల్ఫిన్ల జనాభా సుమారు 2 వేలుగా అంచనా వేశారు.
యూపీలో పర్యాటకులు, స్థానిక నివాసితులు ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మన తాగునీరు, ప్రకృతికి ప్లాస్టిక్ తీవ్ర హాని కలిగిస్తుందన్నారు. వన్యప్రాణులతో ఎలా సంభాషించాలో స్థానికులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని యోగీ తెలిపారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం , సమాజంలో అవగాహన పెంచడం లక్ష్యంగా టైగర్ రిజర్వ్కు అనుసంధానం చేసిన గ్రామాల వారికి మార్గదర్శకులుగా శిక్షణ ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలోని గర్ గంగాలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF), అటవీ శాఖ బృందాలు జీపీఎస్ సహాయంతో డాల్ఫిన్లను లెక్కిస్తున్నాయి. గర్ గంగాలో కొనసాగుతున్న డాల్ఫిన్ గణనపై డీఎఫ్వో సంజయ్ కుమార్ మాల్ వివరాలు వెల్లడించారు. "మేరీ గంగా మేరీ డాల్ఫిన్ 2023" పేరుతో దీనిపై ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని కింద ముజఫర్పూర్ బ్యారేజీ దగ్గర నుండి మొత్తం నరోరా బ్యారేజీ వరకు గంగా నదిలో డాల్ఫిన్ల లెక్కింపు జరుగుతోందన్నారు.
ఇందులో డబ్ల్యూడబ్ల్యూఎఫ్, అటవీ శాఖ బృందాలు రెండూ జాయింట్ యాక్షన్ ద్వారా లెక్కింపు చేపడుతున్నారు. ఇందులో రెండు టీంలు చొప్పున గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తే విధంగా కౌంటింగ్ విధానం ఉందన్నారు. వాటి మధ్య 10 నిమిషాల గ్యాప్ ఇచ్చారు. ముజఫర్పూర్ నుండి నరోరా బ్యారేజీ వరకు మొత్తం బృందం ఈ విరామంలో ఎన్ని డాల్ఫిన్లు డైవ్ చేస్తాయనేది గుర్తిస్తారు. ఆ బృందం డాల్ఫిన్ డైవింగ్ను చూసి దాని జీపీఎస్ లొకేషన్ను నమోదు చేస్తుంది. ఆపై మరొక బృందం వచ్చి దాని జీపీఎస్ లొకేషన్ను నమోదు చేస్తుంది. అది 10 నిమిషాల విరామం తర్వాత వస్తే అది అదే డాల్ఫిన్ అని చూపిస్తుంది, రాకపోతే ఆ తర్వాత అది మరో డాల్ఫిన్ కాబట్టి లెక్కింపు కూడా అదే విధంగా జరుగుతుందని తెలుస్తోంది.
-
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications