వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురు ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో అత్యంత కిరాతకమైన హత్య జరిగింది. ఓ వ్యక్తి తన 15 ఏళ్లు కూతురి ప్రయుడి దేహాన్ని ముక్కలు ముక్కలుగా నిరికి గోనె సంచీలో కుక్కాడు. వాటితో అతను బెంగళూర్‌లోని ఆర్‌కె పురం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ సంఘటన బెంగళూర్ నగరాన్ని గురువారంనాడు కుదిపేసింది.

చిన్నపాటి ఫైనాన్షియర్ అయిన 45 ఏళ్ల రియాజ్ ఖాన్ హతుడు సాదిక్ పాషా (17) తల్లిదండ్రులను అంతకు ముందు హెచ్చరించాడు కూడా. తన కూతురుతో వస్తే మీ పిల్లవాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతానని హెచ్చరించాడు. ఆ బెదిరింపును అతను నిజం చేశాడు.

Ghastly murder: man beheads, chops up daughter’s boyfriend

సాదిక్, ఏడో తరగతి చదువుతున్న అమ్మాయి చిన్నప్పటి నుంచి మిత్రులు. సిద్ధాపురలో పక్క పక్కనే ఉంటూ వస్తున్నారు. తన కూతురు పాషాతో సన్నిహితంగా ఉండడం రియాజ్‌కు నచ్చలేదు. సాదిక్ తల్లిదండ్రులను హెచ్చరించాడు కూడా.

తనకు మరో వ్యక్తితో నిశ్చితార్థం చేయడంతో రియాజ్ కూతురు సాదిక్‌ను పిలిచింది. ఇద్దరు పారిపోయారు. తన కూతురు కనిపించకుండా పోయిందంటూ రియాజ్ జులై 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి జాడ తెలియడంతో రియాజ్. అతని బార్య అష్రాఫ్ బన్నెర్‌గట్టా రోడ్డులోని హోమ్మదేవనహల్లికి బుధవారం రాత్రి వెళ్లారు.

అష్రాప్ కూతురితో గదిలో ఉండిపోయింది. రియాజ్ విపరీతంగా మద్యం సేవించి సాదిక్‌ను బయటకు తీసుకుని వెళ్లి హత్య చేశాడు. గోనెసంచీలో సాదిక్ శవం ముక్కలను వేసుకుని స్కూటర్‌పై రియాజ్ ఆర్‌కె పురం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

English summary
Bengaluru woke up to a ghastly murder on Thursday with an agitated father beheading the lover of his 15-year-old daughter, chopping the body into pieces before packing it in a gunny bag and surrendering at the KR Puram police station in the city with the corpse
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X