ఘజియాబాద్ బాలికల ఆత్మహత్య కేసు.. ముగ్గురు భార్యల కథ.. షాకింగ్ ట్విస్ట్ లు
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ కేసులో ముందు డిజిటల్ వ్యసనంతో ఫోన్లు లాక్కున్నారని ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని భావించగా, దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ కేసు దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది.
ముగ్గురిని పెళ్లి చేసుకున్న బాలికల తండ్రి
బాలికల తండ్రి చేతన్కుమార్ ఇచ్చిన వాంగ్మూలాలు పోలీసులను షాక్ కు గురి చేస్తున్నాయి. అతను చెప్పినవి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. తాను పెళ్లి చేసుకున్న ముగ్గురు మహిళలు సోదరీమణులని అతడు తొలుత చెప్పాడు. కానీ అతని భార్యలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కాదని దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. మూడో భార్య టీనా 2018లో చేతన్ దగ్గర ఉద్యోగం చేసేదని, తర్వాత వారి పెళ్లి చేసుకున్నట్టుగా గుర్తించారు.

చేతన్ మూడు పెళ్ళిళ్ళపై దర్యాప్తు
అప్పటికే చేతన్ కు రెండు పెళ్లిళ్లు జరిగినట్టు నిర్ధారించారు. అయితే అతడిని విచారిస్తున్న క్రమంలో అతను 2010లో సుజాతను, సంతానం లేకపోవడంతో 2013లో హీనా ను వివాహం చేసుకున్నట్టుగా పేర్కొన్నాడు. కానీ మొదటి భార్యకు పదహారేళ్ల కుమార్తె ఉండడంతో చేతన్ వాంగ్మూలం పైన అధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతని వివాహ పత్రాల ద్వారా మూడు వివాహాల తేదీల పైన దర్యాప్తు జరుపుతున్నారు.
చేతన్ వాంగ్మూలం పొంతన లేకపోవటంతో దర్యాప్తులో గందరగోళం
మరోవైపు 2015లో చేతన్ తో సహజీవనం చేసిన ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా వెల్లడయింది. ముగ్గురు అక్క చెల్లెల ఆత్మహత్య కేసులో, తండ్రిగా చెప్పబడే చేతన్ వివాహాలకు సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి రావడంతో పాటు, అతను ఇచ్చిన వాంగ్మూలం పొంతన లేకుండా ఉండడంతో దర్యాప్తులో మరింత గందరగోళం చోటుచేసుకుంది. అసలు చేతన్ ఎందుకు ఇలా చెబుతున్నాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యలకు ముందు బాధితుల ఫోన్లు విక్రయం
త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో నివసించిన వారు ఘటన సమయంలో అందరూ ఒకే గదిలో ఎందుకు నిద్రించారు అన్నది కూడా అనుమానస్పదం గానే ఉంది. చేతన్ ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలను స్కూల్ మాన్పించాం అని చెప్పగా, ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది రోజులు ముందు బాధితులు వారి ఫోన్లను అమ్మేయడం అనేక సందేహాలకు దారితీస్తుంది.
ఫోన్స్ లో ఏముందో రికవరీ చేస్తున్న పోలీసులు
దీంతో అసలు వారి ఫోన్లలో ఏముంది అనేది తెలుసుకోవడం కోసం పోలీసులు టెక్నాలజీ సహాయంతో రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఏం జరిగింది అన్నది తెలుసుకోవడానికి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని ట్విస్టులతో, అనుకోని మలుపులతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్ విసురుతోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications