ఘోరం: 9వ తరగతి విద్యార్థినిపై 15మంది గ్యాంగ్రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన మహిళలు, యువతులు, బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది.
న్యూఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న ఓ మైనర్ బాలిక(15)పై తరగతి గదిలోని సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో సంచలనం రేకెత్తించింది.
తన మైనర్ కూతురిపై సహాధ్యాయులైన 15 మంది విద్యార్థులు సామూహిక అత్యాచారం జరిపారని బాలిక తల్లి జామియానగర్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనిపై తాము దర్యాప్తు చేసి బాట్లా ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.
ప్రధాన నిందితుడిగా ఉన్న బాలుడ్ని జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. మొదటిసారి జరిపిన అఘాయిత్యాన్ని వీడియో తీసిని నిందితులు.. బాధిత బాలికను బెదిరింపులకు గురిచేసి పలుమార్లు 15మంది నిందిత బాలురు వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.