రైలులో విద్యార్థినిపై ఆరు మంది గ్యాంగ్ రేప్: పోలీసులకు చెబుతోందని ఎత్తి !
వేగంగా వెలుతున్న రైలులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు తరువాత ఆమెను బయటకు విసిరేసిన ఘటన బీహార్ లో జరిగింది. బీహార్ లోని లఖిసెరాయ్ జిల్లాలోని కీలు రైల్వే జంక్షన్ సమీపంలో ఈ దారుణం జరిగ
పాట్నా: వేగంగా వెలుతున్న రైలులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు తరువాత ఆమెను బయటకు విసిరేసిన ఘటన బీహార్ లో జరిగింది. బీహార్ లోని లఖిసెరాయ్ జిల్లాలోని కీలు రైల్వే జంక్షన్ సమీపంలో ఈ దారుణం జరిగిందని పోలీసులు చెప్పారు.
భార్య ఇంటిలో లేదు: భార్య చెల్లి మీద కన్ను వేశాడు, అనుకున్నది చేశాడు, చివరికి?
10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల అమ్మాయి రైలులో ఎక్కింది. ఖాళీగా ఉన్న రైలు బోగీలో యువతి కుర్చునింది. ఆ సమయంలో ఆరు మంది కామాంధులు యువతి మీద సామూహిక అత్యాచారం చేశారు. ఆ సందర్బంలో ఆ బోగిలోకి ఎవ్వరూ రాకపోవడంతో కామాంధులు రెచ్చిపోయారు.
తరువాత విద్యార్థిని విషయం పోలీసులకు చెబుతోందని భయపడిన కామాంధులు ఆమె ప్రాణాలు తియ్యాలని నిర్ణయించారు. వేగంగా వెలుతున్న రైలు నుంచి ఆమెను బయటకు తోసేశారు రైలు నుంచి కిందకు తోసేయ్యడంతో విద్యార్థినికి తీవ్రగాయాలైనాయి.
నాతో ఒక్క రాత్రి పడుకో: రూ. లక్షలు వద్దు, స్మగ్లర్ భార్య అందానికి, పోలీసు ఆఫీసర్ ఆఫర్ !
తీవ్రగాయాలైన యువతిని పాట్నా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి పరిచయం ఉన్న ఇద్దరు కామాంధులతో సహ ఆరు మంది ఆమె మీద అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. ఈ విషయం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దృష్టికి వెళ్లింది. కామాంధుల కోసం గాలిస్తున్నామని, విద్యార్థిని పరిస్థితి చాల విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.