యువతిపై గ్యాంగ్రేప్: గ్రామ పెద్ద, స్నేహితుడిపై కేసు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామిలి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతిపై ఓ గ్రామ పెద్ద, అతని స్నేహితుడు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం... పని మీద తన పాత ఇంటికి వెళ్లిన యువతిపై గ్రామ పెద్ద ఫర్జాంద్ అలీ, అతని స్నేహితుడు ఇస్రార్ అహ్మద్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపుతామని ఆమెను బెదిరింపులకు గురిచేశారు.
కాగా, బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హిట్ అండ్ రన్: ముగ్గురు మృతి
చెన్నై: చెన్నై నగరంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఫూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి.. పేవ్మెంట్పై నిద్రిస్తున్న వారిపై నుంచి మోటారు బైకు నడిపి మూడు నిండు ప్రాణాలు బలిగొన్నాడు.
మృతిచెందిన ముగ్గురిలో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటననకు సంబంధించి ఒకరిని అరెస్టుచేశామని పోలీసులు చెప్పారు. మృతులతోపాటు ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.












Click it and Unblock the Notifications