గోవాలో బీజేపీకి ఎదురు దెబ్బ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, మనోహర్ పారిక్కర్ నియోజక వర్గం !
పణజి: గోవాలో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న పణజి శాసన సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాదించింది. పణజి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సిద్దార్థ్ కుంకోలియంకర్ ను స్థానిక ఓటర్లు ఆదరించకపోవడంతో ఓడిపోయారు.
పణజి నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మనోహర్ పారిక్కర్ సీఎం అయ్యారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మనోహర్ పారిక్కర్ మరణించారు. మనోహర్ పారిక్కర్ మరణంతో ఖాళీ అయిన పణజి నియోజక వర్గంలో మే 19న ఉప ఎన్నికలు జరిగాయి.

మనోహర్ పారిక్కర్ మరణించడంతో ఆయన కుమారుడు ఉత్పల్ పారిక్కర్ కు బీజేపీ టిక్కెట్ కేటాయిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే బీజేపీ నాయకులు సిద్దార్థ్ కుంకోలియంకర్ కు టిక్కెట్ కేటాయించారు. మనోహర్ పారిక్కర్ కుమారుడికి టిక్కెట్ కేటాయించకపోవడంతో సానుభూతి ఓట్లు దూరం అయ్యాయి.
పణజిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్దార్థ్ కుంకోలియంకర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అటానాసియో మోన్ఫ్ రట్స్ 1, 775 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాదించారు. గావాలో అధికారంలో ఉన్న బీజేపీకి పణజి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications