చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాము, బీజేపీకి పెద్దగా ఓట్లు రాలేదు, సింపుల్ గా చిదంబరం జంప్ !
గోవా/బెంగళూరు: గోవాలో మా పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది, గోవాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బా కొట్టుకున్నారు. గోవాలో కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసిన నాయకులు అందరిని రిసార్టులకు తరలించారు. అయితే రిసార్టు రాజకీయాలు పూర్తిగా రివర్స్ అవుతాయి అని కాంగ్రెస్ పార్టీ ఊహించలేపోయింది. రిసార్టులో ఉన్న ఆపార్టీ నాయకులు ఒక్కరు కూడా చెయ్యిజారిపోకుండా చూసుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు తారు మారు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుక కరుచుకున్నారు.
గోవాలో పొడిచేయాలని కర్ణాటక, తమిళనాడుకు చెందిన సీనియర్ నాయకులు బుధవారం నుంచి గోవాలో మకాం వేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తుస్సుమన్నారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ ఓటిమిని మేము అంగీకరిస్తున్నామని చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందు చెప్పారు. చాలా తక్కువ ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, బీజేపీకి పెద్దగా ఓట్లు రాలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం అన్నారు.
Comedy kings: నిన్న కామెడీ కింగ్స్, నేడు రియల్ హీరోలు, ఉక్రెయిన్ జెలెన్ స్కీ, పంజాబ్ మాన్ లెక్క!
రిసార్టు రాజకీయాలు రివర్స్
గోవాలో మా పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది, గోవాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బా కొట్టుకున్నారు. గోవాలో కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసిన నాయకులు అందరిని రిసార్టులకు తరలించారు. అయితే రిసార్టు రాజకీయాలు పూర్తిగా రివర్స్ అవుతాయి అని కాంగ్రెస్ పార్టీ ఊహించలేపోయింది.
పొడిచేయాలని వెళ్లిన రెండు రాష్ట్రాల నాయకులు
రిసార్టులో ఉన్న ఆపార్టీ నాయకులు ఒక్కరు కూడా చెయ్యిజారిపోకుండా చూసుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు తారు మారు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుక కరుచుకున్నారు. గోవాలో పొడిచేయాలని కర్ణాటక, తమిళనాడుకు చెందిన సీనియర్ నాయకులు బుధవారం నుంచి గోవాలో మకాం వేశారు.
పెద్దగా తేడా లేదు..... తక్కువ ఓట్లు మాత్రమే వచ్చాయి
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తుస్సుమన్నారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని మేము అంగీకరిస్తున్నామని చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందు చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి పి. చిందపబరం, కర్ణాటక మాజీ మంత్రులు డీకే శివకుమార్, దినేష్ గుండూరావ్ తదితరులు గోవాలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించారు.