40 ఏళ్లలో తలకిందులైన చరిత్ర, గడ్డి భూముల మహారాజు అస్తిత్వ పోరాటం

ఒకప్పుడు భారత ఉపఖండంలోని 11 రాష్ట్రాల్లో రాజసం ఉట్టిపడేలా విహరించిన 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' (గోడవన్) ఇప్పుడు అస్తిత్వ పోరాటంలో ఉంది. 1980వ దశకంలో సుమారు 2,000 వరకు ఉన్న వీటి సంఖ్య ఇప్పుడు కేవలం 150కి పడిపోవడం పర్యావరణ ప్రేమికులను కలవరపెడుతోంది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. మన ఎడారి ప్రాంతాలకు ఒకప్పుడు హాల్‌మార్క్‌గా నిలిచిన ఈ పక్షిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు.

గోడవన్ పక్షి చూడటానికి నిప్పుకోడిని పోలి ఉంటుంది. సుమారు ఒక మీటరు ఎత్తు, 15 కిలోల వరకు బరువు ఉండే ఈ పక్షి, ప్రపంచంలోని అత్యంత భారీ ఎగిరే పక్షులలో ఒకటి. మధ్యప్రదేశ్‌లో 'సోన్ చిరియా'గా, రాజస్థాన్‌లో 'గోడవన్'గా, మహారాష్ట్రలో 'మాల్‌దోక్'గా పిలువబడే ఈ పక్షి.. గడ్డి భూములకు అసలైన అందం. భారీ శరీరం ఉన్నప్పటికీ ఆకాశంలో ఇది చేసే విన్యాసాలు అద్భుతం. సర్వభక్షకమైన ఈ పక్షి అటు గింజలను, ఇటు పాములు, తేళ్లను కూడా ఆహారంగా తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతోంది.

Godavan Protection How Solar Bird Diverters are Saving India s Heaviest Flying Bird from Extinction

మృత్యుపాశాలుగా మారిన విద్యుత్ తీగలు!

గోడవన్ అంతరించిపోవడానికి ప్రధాన కారణం దాని శారీరక పరిమితులే కావడం విచారకరం. భారీ బరువు కారణంగా ఇతర పక్షులంత చురుకుగా ఉండలేకపోవడం, దానికి తోడు పక్కల నుంచి మాత్రమే చూడగలిగే దృష్టి లోపం దీనికి శాపంగా మారాయి. ఎడారి ప్రాంతాల్లోని హై-టెన్షన్ విద్యుత్ తీగలను ఇవి గుర్తించలేక, వాటిని ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీనికి తోడు అక్రమ వేట, గూళ్లను కుక్కలు ధ్వంసం చేయడం, ఏటా ఒకే గుడ్డు పెట్టే నైజం వీటి సంఖ్యను దారుణంగా తగ్గించేశాయి.

 కలలోకి ఈ పక్షి వస్తే కోటీశ్వరులే..!
కలలోకి ఈ పక్షి వస్తే కోటీశ్వరులే..!

రక్షణ కవచం: 'బర్డ్ డైవర్టర్ల' ప్రయోగం

ఈ పక్షులను విద్యుత్ ప్రమాదాల నుండి కాపాడేందుకు శాస్త్రవేత్తలు 'బర్డ్ డైవర్టర్లను' రంగంలోకి దించారు. జైసల్మేర్ ప్రాంతంలోని విద్యుత్ తీగలకు అమర్చిన ఈ సౌరశక్తి పరికరాలు, రాత్రిపూట వెలుగుతూ పక్షులను హెచ్చరిస్తాయి. ఫలితంగా విద్యుత్ షాక్ మరణాలు 50-80% వరకు తగ్గాయని పరిశోధకులు వెల్లడించారు. జాతీయ స్థాయిలో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వంటి సంస్థలు, అంతర్జాతీయంగా ఐయూసీఎన్ (IUCN) వంటి సంస్థలు ఈ పక్షిని కాపాడేందుకు ఏకమయ్యాయి.

11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్

తిరిగి రానున్న 'సోన్ చిరియా' వైభవం!

రాజస్థాన్ ప్రభుత్వం 2013లోనే 'ప్రాజెక్ట్ గోడవన్'ను ప్రారంభించగా, డెహ్రాడూన్ వన్యప్రాణి సంస్థ శాస్త్రవేత్తలు కృత్రిమ పద్ధతుల్లో (ఇంక్యుబేటర్లు) గుడ్లను పొదిగించి పిల్లలను సృష్టించడంలో సక్సెస్ అయ్యారు. ఈ పిల్లలను పెంచి అడవిలో వదిలిపెట్టే ప్రక్రియ వచ్చే 20-25 ఏళ్ల పాటు సాగనుంది. అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్వాలియర్ సమీపంలోని ఘాటిగావ్‌లో ప్రత్యేక రిజర్వును ఏర్పాటు చేసి, ఈ పక్షిని తిరిగి ఆ రాష్ట్రానికి తీసుకురావాలని పట్టుదలతో ఉంది.

చిరుతపులిలాగే ఈ పక్షి కూడా మన దేశం నుండి శాశ్వతంగా కనుమరుగు కాకుండా ఉండాలంటే, ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన సాగాలి. గడ్డి భూముల ఈ 'మహారాజు' మళ్ళీ ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని ఆశిద్దాం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+