మరణ శిక్ష నుంచి జీవిత ఖైదు: గోద్రా కేసులో కీలక తీర్పు, నాటి మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం
గోద్రా అల్లర్ల కేసులో పలువురు నిందితుల శిక్షను గుజరాత్ హైకోర్టు మార్పు చేసింది. ఈ కేసులో పదకొండు మందికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.
అహ్మదాబాద్: గోద్రా రైలు దగ్ధం కేసులో పలువురు నిందితుల శిక్షను గుజరాత్ హైకోర్టు మార్పు చేసింది. ఈ కేసులో పదకొండు మందికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.
ఈ శిక్షను గుజరాత్ హైకోర్టు మార్చింది. వారి శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. రైలు దగ్ధంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకులకు రూ.10లక్షలు ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది.

అదే సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం (మోడీ గవర్నమెంట్) విఫలమైందని పేర్కొంది.
కాగా, గోద్రా రైలు దహనం కేసులో మొత్తం 31 మందిని దోషులుగా తేల్చారు. 63 మందిని నిర్దోషులుగా తేల్చారు. 2011లో ఇందులో 20 మందికి జీవిత ఖైదు, 11 మందికి మరణ శిక్ష విధించారు. తమ శిక్షను సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం.. వారి శిక్షను మరణ శిక్ష నుంచి జీవిత ఖైదుకు మార్చింది.












Click it and Unblock the Notifications