14ఏళ్ల తర్వాత గోద్రా కుట్రదారు అరెస్ట్

గాంధీనగర్‌: గోద్రా రైలు తగలబెట్టిన కేసులో ఎట్టకేలకు ఘటన జరిగిన 14ఏళ్ల తర్వాత ప్రధాన కుట్రదారు ఫరూక్‌ భానా అరెస్టయ్యాడు. గుజరాత్‌ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్‌ పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ అయిన ఫరూక్‌ భానా రైలు దగ్ధం చేయడానికి కుట్రపన్నాడని పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. 14ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఫరూక్‌ను గుజరాత్‌లో కలోల్‌ టోల్‌ నాకా వద్ద పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

 Godhra Train Burning: Key Accused Farooq Bhana Arrested After 14 Years

2002 ఫిబ్రవరిలో గోద్రా స్టేషన్‌ సమీపంలో కొందరు వ్యక్తులు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుపై దాడిచేసి దానికి నిప్పుపెట్టడంతో రైలు దహనమైంది. దాదాపు 60 మందికిపైగా ప్రయాణికులు మరణించారు.

ఈ ఘటన గుజరాత్‌లోని గోద్రాలో తీవ్ర అల్లర్లకు కారణమైంది. గోద్రా అల్లర్లలో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 ఫిబ్రవరిలో గోద్రా రైలు దగ్ధం కేసులో ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా నిర్ధారించి వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవితఖైదు విధించింది. పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల్లో భానా ప్రధాన నిందితుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+