ఇకపై భారీ మొత్తంలో పరిహారం: విమానయాన శాఖ కొత్త ప్రతిపాదనలు..
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు లబ్ది చేకూర్చేలా విమానయాన శాఖ కొన్ని కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ మేరకు ఇక నుంచి విమానాల్లో ప్రయాణికుల లగేజీ పోయినా, విమానాలు ఆలస్యం లేదా రద్దయినా ప్రయాణికులకు ఆయా సంస్థలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
వీటితో పాటు టికెట్ క్యాన్సిలేషన్పై కూడా ఛార్జీలను తగ్గించింది. ప్రస్తుతం దేశీయ విమానాల్లో లగేజీ పోయినా లేదా డ్యామేజ్ అయినా గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇంటర్నేషనల్ విమానాల్లో మాత్రం రూ.1లక్ష వరకు పరిహారం అందుతోంది.

దేశీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది. కేజీకి రూ.3వేల చొప్పున పరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. విమానాలు ఆలస్యమైన సందర్భాల్లో ఇచ్చే పరిహారాన్ని కూడా పెంచే యోచనలో విమానయానశాఖ ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications