భారత్లో గూగుల్ గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్స్ సెంటర్, 10 బిలియన్ల పెట్టుబడి: మోడీపై సుందర్ పిచాయ్ ప్రశంసలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతదేశానికి గుడ్న్యూస్ చెప్పింది. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో తన గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai) ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత వెల్లడించారు.
మోడీ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ఫ్లాగ్షిప్ క్యాంపెయిన్ను, దీనిపై ప్రధాని మోడీ దార్శకనితను సుందర్ పిచాయ్ కొనియాడారు. అమెరికాలో చారిత్రాత్మక పర్యటన సందర్భంగా ప్రధాని మోడీని కలవడం గౌరవంగా ఉంది. భారత్ డిజిటలైజేషన్ ఫండ్లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు(రూ. 8.19 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రధాని మోడీతో పంచుకున్నాం. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో మా గ్లోబల్ ఫిన్టెక్ ఆపరేషన్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.

ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు మోడీ జూన్ 21 నుంచి జూన్ 24 వరకు యుఎస్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పిచాయ్తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్, ఏఎమ్డీ సీఈవో లిసా సు తదితర అగ్రశ్రేణి సీఈవోలతో ప్రధాని భేటీ అయ్యారు.
ఈరోజు మేము గుజరాత్లోని GIFT సిటీలో మా గ్లోబల్ ఫిన్టెక్ కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాము. ఇది భారతదేశం ఫిన్టెక్ నాయకత్వాన్ని సుస్థిరం చేస్తుంది, యూపీఐ, ఆధార్కు ధన్యవాదాలు. మేము ఆ పునాదిపై నిర్మించి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లబోతున్నాము' అని పిచాయ్ చెప్పారు. ముఖ్యంగా డిజిటల్ ఇండియా దార్శనికత, ఆర్థిక అవకాశాల చుట్టూ దేశం సాధించిన పురోగతిని చూడటం చాలా ఉత్సాహంగా ఉందని భారతీయ సంతతికి చెందిన సీఈవో సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.
'నేను డిసెంబరులో ప్రధానమంత్రిని కలిశాను, మేము మా సంభాషణను కొనసాగించాము. గూగుల్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్లో $10 బిలియన్లు పెట్టుబడి పెడుతుందని, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పనిచేసే కంపెనీలతో సహా దాని ద్వారా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నామని మేము పంచుకున్నాము. అందులో భాగంగా, మేము 100 భాషల చొరవను కలిగి ఉన్నాము. మేము అతి త్వరలో మరిన్ని భారతీయ భాషలకు బాట్ను తీసుకువస్తున్నాము' అని పిచాయ్ వెల్లడించారు. డిజిటల్ ఇండియా కోసం ప్రధాన మంత్రి మోడీ విజన్ చాలా ముందుందని ఆయన అన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications