దాణా స్కాంలో జైలు శిక్ష మళ్లీ రేపటికి వాయిదా: లాలూ మనుషుల నుంచి ఫోన్లు.. జడ్జి వ్యాఖ్య
న్యూఢిల్లీ: దాణా స్కాంలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో లాతో పాటు మరో 15 మందిని దోషులుగా తేలుస్తూ గత ఏడాది 23న రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
దీనికి సంబంధించి జనవరి 3న శిక్ష ఖరారు చేస్తామని చెప్పింది. అయితే బుధవారం న్యాయవాది విందేశ్వర ప్రసాద్ మృతితో తీర్పు గురువారానికి వాయిదా వేశారు. నేడు మళ్లీ శుక్రవారానికి వాయిదా వేశారు.

కాగా, ఈ సందర్భంగా జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ మనుషుల నుంచి తనకు ఫోన్లు వచ్చాయని, కానీ భయపడాల్సింది లేదని, నేను చట్టాన్ని అనుసరిస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన లాలూతోనే అన్నట్లుగా తెలుస్తోంది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications