covid చికిత్సకు కేంద్రం కొత్త గైడ్లైన్స్ -పిల్లలకు రెమ్డెసివిర్ వద్దు -తప్పదనుకుంటేనే సీటీ స్కాన్, స్టెరాయి
పలు దేశాల్లో కరోనా మహమ్మారి మూడో దశ విలయం మొదలైన దరిమిలా, భారత్ లోనూ అది తప్పదని, తొలి, రెండో దశల్లో వృద్దులు, యువకులను బలితీసుకున్న మహమ్మారి.. మైడో దశలో చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందనే రిపోర్టులు వెలువడటం తెలిసిందే. అయితే, మన దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ తలెత్తబోదని, చిన్నపిల్లలకు పెద్దగా ఇబ్బంది ఉండదని కేంద్రం భరోసా ఇస్తున్నప్పటికీ, చిన్న పిల్లలకు కరోనా చిత్సపై కీలక మార్గదర్శకాలను జారీచేసింది..
చిన్నారులు కోవిడ్ ప్రభావితమయితే దానికి సంబంధించిన చికిత్స, నిర్వహణ పద్దతులను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) బుధవారం ఈ మేరకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో..

కరోనా సోకిన చిన్న పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వరాదని కేంద్రం స్పష్టం చేసింది. పిల్లలకు కచ్చితంగా అవసరమైతేనే, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో హై-రెజల్యూషన్ సీటీ స్కాన్ను తీయించాలని చెప్పింది. స్టెరాయిడ్లను కూడా దాదాపు అవాయిడ్ చేయాలని, అత్యంత క్రిటికల్ అనుకున్న కేసుల్లో మాత్రమే స్టెరాయిడ్లను ఆప్షన్ గా భావించాలని, ఎందుకంటే లక్షణాలులేని, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారికి ఇవి హానికరమని కేంద్రం పేర్కొంది.
కరోనా సోకిన తర్వాత, తక్కువ, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారిలో జ్వరం తగ్గేందుకు ప్రతి 4-6 గంటలకు ఒకసారి పారాసిటమాల్ 10-15ఎంజీ/కేజీ/డోసు ఇవ్వొచ్చని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం చెప్పింది. పిల్లలకు కరోనా టెస్టులకు సంబంధించి.. గదిలో పిల్లలు ఆరు నిమిషాల పాటు నడిచాక, పల్స్ ఆక్సీమీటర్ సాయంతో వారి ఆక్సిజన్ స్థాయులు తెలుసుకోవాలని, ఆక్సిజన్ సమస్య తలెత్తితే వైద్యుల్ని సంప్రదించాలని పేర్కొంది.
గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మే చివరి నాటికి కరోనా మహమ్మారి కారణంగా 9,300 మందికి పైగా చిన్నారులు అనాథలయ్యారని సుప్రీంకోర్టుకు బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) వెల్లడించింది. ఇలాంటి బాలల సంక్షేమం కోసం ఆరంచెల పథకాన్ని ప్రారంభించామని సుప్రీంకోర్టులో ఎన్సీపీసీఆర్ అఫిడవిట్ను సమర్పించింది.అనాథలైన పిల్లల కోసం రూపొందించిన 'బాల్ స్వరాజ్' పోర్టల్లో 9,346 మంది అనాథ బాలల వివరాలను ఎన్సీపీసీఆర్ అప్లోడ్ చేసింది.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications