డిజిటల్ పేమేంట్స్: రూ. 100 క్యాష్బ్యాక్ ఆఫర్, కేంద్రం కొత్త ప్లాన్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వినియోగదారులతో పాటు వ్యాపారసంస్థలకు కూడ డిజిటల్ చెల్లింపుల ద్వారా చెల్లింపులకు పాల్పడితే క్యాష్బ్యాక్ ఇవ్వాలని కేంద్రం సన్నాహలు చేస్తోంది.
పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో నగదు చెల్లింపులు కూడ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్రం భావించింది. కానీ, ఆశించిన రీతిలో డిజిటల్ చెల్లింపులు నమోదు కావడం లేదు. ఇంకా కూడ ఎక్కువగానే నగదు చెల్లింపులపైనే ఆధారపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించాలని కేంద్రం కొత్త ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.నగదు రహిత చెల్లింపులు చేసే వినియోగదారులకు గరిష్ఠ చిల్లర ధరలో తగ్గింపు ఇస్తారు. ఈ గరిష్ఠ మొత్తాన్ని రూ.100లకు పరిమితం చేస్తారు.

వ్యాపార సంస్థలకు వాటి టర్నోవర్ ఆధారంగా క్యాష్బ్యాక్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే నెల 4న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ ముందు ఈ ప్రతిపాదన పెట్టనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పీఎంవోలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ తరహ ప్రోత్సాహకాలను అమలు చేస్తే నగదు వినియోగం కూడ మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. ప్రతి చిన్న దానికి కూడ నగదు చెల్లింపులపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications