ఆలయమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్ల దాడి: భారీ పేలుడుతో భయాందోళనలు
శ్రీనగర్: హిందూ ఆలయ విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్ దాడులకు పాల్పడ్డారు. అయితే, ఆ గ్రెనెడ్లు ఆలయం సమీపంలోని పడి భారీ శబ్ధంతో పేలాయి. దీంతో స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు. జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన.
పూంఛ్, జమ్మూ జిల్లాల్లో పేలుళ్లకు కుట్రపన్నిన నలుగురు మిలిటెంట్లను అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ గ్రెనెడ్ దాడి జరగడం గమనార్హం. జమ్మూకాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు ఏదో రకంగా అలజడిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు.

హీరానగర్లోని ఆలయంపైకి గ్రెనెడ్ విసరగా.. అది సమీపంలో పడిపేలిపోయిందని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications